Home » కేఏ పాల్ వెంబడి తిరిగే ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా.. కేఏ పాల్ కు ఆమె..?

కేఏ పాల్ వెంబడి తిరిగే ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా.. కేఏ పాల్ కు ఆమె..?

by Sravanthi
Ad

కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగుతూ కడుపుబ్బ నవ్విస్తూ, ఇతర నాయకులను ఎడాపెడా తిడుతూ ఉంటారు. మరి ఆయన కోడలు కూడా ఎప్పుడూ ఆయన వెంటే మామకు తగ్గ కోడలిగా నడుచుకుంటూ ఉంటుంది. ఆమె పేరే జ్యోతి.. మరి ఆమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చిందో బ్యాగ్రౌండ్ తెలుసుకుందాం..? ఇటీవల కేఏ పాల్ ఆమె గురించి చెబుతూ తన కొడుకు ఆమె లవ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో కె ఏ పాల్ బరిలోకి దిగారు. ఈ సందర్భంలో కూడా జ్యోతి గురించి చర్చ జరిగింది. ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ రాజకీయ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటారు జ్యోతి. కే ఏ పాల్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో, ఆయనపై దాడి జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి చాలా స్పందించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె చిన్నప్పుడే కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందింది. దైవ పరమైన కార్యక్రమాలు అంటే జ్యోతికి చాలా ఇష్టం. ఆ కారణంతోనే పాల్ కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది అమెరికాలో. దింతో జ్యోతికి మరియు పాల్ కుమారుడికి సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కే ఏ పాల్ కి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు అయ్యాయి. ఇక మిగిలింది కుమారుడు ఒక్కరే. అతని పేరే కిలారి జాన్ పాల్. ఆయన అమెరికాలోనే ఉంటారు. ఇద్దరు లవ్ చేసుకోవడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. జ్యోతి 2017 వరకు అమెరికా లోనే ఉంది. 2019 ఎన్నికల్లో పాల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయనతోనే ఉన్నారు. రాబోయే రోజుల్లో జ్యోతికి పాల్ కుమారుడితో వివాహం జరగబోతోందని తన సన్నిహితులు చెబుతున్నారు. అయితే జ్యోతి మరియు జాన్ పాల్ వారి వయసు 30 దాటితే తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాహం వాయిదా పడిందట.

Advertisement

ALSO READ;

Advertisement

ఫస్ట్ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

నటి ఇంద్రజ భర్త బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా.. ఆయన కూడా నటుడే అని మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading