Home » ఏపీ మంత్రి విడదల రజిని గారి భర్త ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ?

ఏపీ మంత్రి విడదల రజిని గారి భర్త ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో “సరైనోడు” సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్ గా నటించిన కేథరిన్ ఎమ్మెల్యేగా నటించారు. అందమైన ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ వెంట హీరో అల్లు అర్జున్ ప్రేమ కోసం వెంట తిరుగుతూ ఉంటాడు. క్రేజ్ ఉన్న ఎమ్మెల్యేగా కేథరిన్ కనిపిస్తారు. రియల్ లైఫ్ లో అలాంటి క్రేజ్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే.. మొదట వినిపించే పేరు విడదల రజిని గారిదే. తోటి రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉంటూ.. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలో ముందుండే రజినీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా క్రేజ్ ఉంది.

Advertisement

మంత్రి బాధ్యతలు చేపట్టిన రజిని అంటే ప్రజల్లో కూడా అభిమానం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకున్న ఫాలోయింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఆమె టాలెంట్ ను గుర్తించిన ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమెను తన మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో.. ఆమె ఒక్కసారిగా వైరల్ అయ్యారు. అయితే.. రజిని గారి హస్బెండ్ గురించి ఎవరికీ తెలియదు. ఆయన ఎవరు ఏమి చేస్తుంటారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Advertisement

రజిని గారు రాజకీయాల్లోకి రాకముందు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేసే వారు. ఆ తరువాత అమెరికాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత కుమార స్వామిని వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత రజిని కూడా అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కుమార స్వామి కంపెనీకి చెందిన వ్యవహారాలను చూసుకునేవారు. వీరి కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ తో ఎన్నో లాభాలను అందించేది. ఈ కంపెనీ ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగాలను ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న రజిని రాష్ట్ర విభజన తరువాత తన నియోజక వర్గానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రత్తిపాటి పుల్లారావు గారినే తన రాజకీయ గురువుగా స్వీకరించి తెలుగు దేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మంత్రి స్థానానికి చేరుకున్నారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading