Home » చిరంజీవి గురించి ఆ టాలీవుడ్ దర్శకుడు ఏమన్నారో తెలుసా ?

చిరంజీవి గురించి ఆ టాలీవుడ్ దర్శకుడు ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బేబి మూవీ ట్రెండింగ్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ బేబి. చిన్న సినిమాగా విడుదలైన బేబి ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్షేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ భారీ విజయం సాధించిన సందర్భంగా జులై 20న మెగా కల్ట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. 

Advertisement

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి  ఓ దురదృష్టవంతుడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇది విన్నవారందరూ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఇక ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని కూల్ అయ్యారు. సాయి రాజేష్ మాట్లాడుతూ.. “ అన్నయ్య మా జీవితాల గురించి మీకు తెలియదు. ఒక్కసారి మాలాగా బ్రతికి చూడండి. 

Advertisement

మేము ఎలా ఉంటాం, ఏం చేస్తాం అనేది చూడలేరు. చిరంజీవి ఆయనకు ఆయన అభిమానుల్లా ఉండలేరు. ఆయనకు అభిమానిలా ఉండే అదృష్టం ఆయనకు లేనేలేదు. మాకు తలనొప్పి వచ్చినా.. జ్వరం వచ్చినా.. సంతోషం కలిగినా, బాధ కలిగినా మా మందు ఆయన పాటే”  అంటూ  చిరంజీవి పై తనకు అభిమానాన్ని ఈ విధంగా చెప్పుకొచ్చారు. సాయి రాజేష్ వ్యాఖ్యలపై మెగా అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం విశేషం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బ్రో మూవీ కలెక్షన్ల గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

Visitors Are Also Reading