Home » నిద్ర లేవగానే వేటిని చూస్తే మంచిదో తెలుసా…వీటిని చూస్తే దరిద్రమే !

నిద్ర లేవగానే వేటిని చూస్తే మంచిదో తెలుసా…వీటిని చూస్తే దరిద్రమే !

by Bunty
Ad

రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం దేనినైతే చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలామంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడు ఫోటోలను చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని నిద్ర లేస్తారు. ఉదయం నిద్ర లేచాక ఏదో ఒక వస్తువు చూస్తాం. లేదంటే దేవుడు ఫోటోలు చూస్తారు. కొంతమంది చేతికి ఉన్న ఉంగరాలను చూసి లేస్తూ ఉంటారు. కొందరైతే వాళ్ళ ముఖాన్ని వాళ్ళే చూసుకుని నిద్రలేస్తారు.

Advertisement

ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ ను చూస్తూ నిద్ర లేస్తున్నారు. ఇది చాలా చెడ్డ అలవాటు. అయితే ఈ అలవాటు ఉంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండా చాలామంది కాఫీ, టీ తాగుతూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. అదే విధంగా దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరు చూడకపోవడం మంచిది. కొంతమంది తిరుగుతూ పళ్ళు తోముకుంటారు. కొందరు ఎండ తగలాలని ఎండలో నిలబడి పళ్ళను శుభ్రం చేసుకుంటారు. ఇలా చేయడం వలన సూర్యుడికి ఆగ్రహం వస్తుందట.

Advertisement

డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుందని పండితులు అంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా చెడు జరిగితే ఈరోజు మనం ఎవరి మొహం చూసామో అని అనుకుంటూ ఉంటాము. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి అస్సలు వెళ్లవద్దు.  స్త్రీలు ఉదయాన్నే శుభ్రం చేయని పాత్రలను చూడకూడదు. ఉదయం లేవగానే జంతువుల బోమ్మల్ని కూడా చూడడం మంచిది కాదు. నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మనం చేసే పాపాలు అన్నింటిని భూదేవి మోస్తుంది కనుక నిద్ర లేవగానే వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం మంచిది. దేవతలు కొలువై ఉండే గోవుని, తులసి మొక్కని చూస్తే మంచి జరుగుతుంది. గుడి గోపురాన్ని, పర్వతాలని, సముద్రాన్ని చూస్తే కూడా అంతా శుభం కలుగుతుంది. బంగారాన్ని, దూడతో ఉన్న ఆవుని, ఎర్రచందనాన్ని చూసినా కూడా చక్కటి ఫలితం కనబడుతుంది.

ఇవి కూడా చదవండి

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

Visitors Are Also Reading