Home » రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా ?

రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా ?

by Anji
Ad

 నీరు అనేది చాలా ముఖ్యం. మనిషి ప్రతీ అవసరాన్ని తీర్చేది నీళ్లే. నీరు లేనిదే ఏ పనీ పూర్తి కాదు. వాటర్ తాగకుండా కూడా ఏ మనిషి ఎక్కువ కాలం బ్రతకలేడు. శరీరంలో మలినాలను బయటకు పంపాలన్నా.. ఆరోగ్యం ఉండాలన్నా నీరు ఎంతో అవసరం అవుతుంది. కనీసం రోజుకు మూడు లీటర్ల నీళ్లు అయినా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. అయితే నీటిని ఎలా తాగాలనేదానిపై ఎన్నో క్లారిటీలు వచ్చినా.. కొన్ని అపోహలు మాత్రం పోవడం లేదు. తాజాగా మరో విషయం చర్చకు వస్తోంది. రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదని చెబుతున్నారు. మరి రాత్రి పూట నీటిని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Advertisement

నీరు ఎంత తాగితే అంత మంచిది. కానీ తాగే సమయంలోనే తాగాలి. అప్పుడు శరీరానికి కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే అందంగా ఉండటంలో కూడా నీరు ముఖ్య పాత్ర వహిస్తుంది. నీరు తీసుకుంటే చర్మం తేమగా, హైడ్రేట్ గా ఉంటుంది. కాంతి వంతంగా తయారవుతుంది. ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం చాలా బెటర్. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా నీటిని తాగ కూడదు. షుగర్ వ్యాధి, రక్త పోటు, గుండె సమస్యలు ఉన్నవారు రాత్రి పూట నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తాగకూడదు. రాత్రి పూట నీటి శాతాన్ని తగ్గకుండా తీసుకోవాలి. లేకుంటే నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. 

రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగడం వల్ల నిద్రకు ఆటంకం వస్తుంది. మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. పొట్ట నిండా నీటిని తాగి పడుకోవడం వల్ల శ్వాస సరగ్గా ఆడదు. అంతే కాకుండా గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పడుకునే అరగంట ముందు ఓ గ్లాస్ వాటర్ ని తాగాలి. మధ్యలో బాగా దాహం అనిపిస్తే అప్పుడు తాగాలి.  రాత్రి పూట మితంగా వాటర్ ను తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న మలినాలు అన్నీ బయటకు పోతాయి. అలాగే చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

 

Visitors Are Also Reading