Home » ‘మొగలి రేకులు’ ఫేమ్ ‘దయ’ మృతికి కారణాలు ఏంటో మీకు తెలుసా ?

‘మొగలి రేకులు’ ఫేమ్ ‘దయ’ మృతికి కారణాలు ఏంటో మీకు తెలుసా ?

by Anji
Ad

మొగలి రేకులు సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మరణించడం బుల్లితెర ఇండస్ట్రీ అంతా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు తన నటనతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ అకస్మాత్తుగా మృతి చెందిన విషయాన్ని నటీనటులు, సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దయ చనిపోవడానికి కారణాలేంటి..? అంటూ ఆరా తీస్తున్నారు. వాస్తవానికి పవిత్రనాథ్ ఇంత చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడం మానసిక కుంగుబాటు అని తెలుస్తోంది. 

Advertisement

ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న ఆయన గత కొంత కాలంగా స్నేహితులకు దూరంగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్ల కిందట పవిత్ర నాథ్ భార్య శశిరేఖ అతనిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన భర్తకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని.. తన ముందు చాలా మంది అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చేవాడని.. ఇదేంటి..? అని ప్రశ్నిస్తే తనను వేధించే వాడని.. అతనితో పాటు అత్త, మామ వేధింపులున్నాయని ఆరోపించింది. 2012లో అత్తమ, మామ పై కేసు కూడా పెట్టింది. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న పవిత్రనాథ్ చక్రవాకం మొగలిరేకులు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిసారిగా  అతడు కృష్ణ తులసి అనే సీరియల్ లో మల్లికార్జున్ పాత్రలో నెగిటివ్ రోల్ చేశాడు.

Advertisement

 

సరిగ్గా ఆరేళ్ల కిందటే అతని హార్ట్ కి ప్రాబ్లమ్ ఉందని తెలుస్తోంది. అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. మానసికంగా చాలా కుంగిపోయాడని స్నేహితులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులు అతనికి మానసికంగా ఒత్తిడికి గురి చేశాయి. కొన్నాళ్లుగా తీవ్ర మనోవేదనతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు పవిత్ర నాథ్. ఆరోగ్యం క్షీణించడంతోనే మరణించినట్టు తెలుస్తోంది. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా పవిత్రనాథ్ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. మొగలి రేకులు సీరియల్లో కనిపించి దయ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని.. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని.. అతడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు.

Also Read :  ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్.. ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading