నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ చాలా బిజీగా ఉంది. పుష్ప తరువాత పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రీసెంట్ గా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీతో సక్సెస్ సాధించి మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.
తాజాగా రష్మికకు టోక్యోలోని క్రంచీ రోల్ అనిమీ అవార్డ్స్ లో పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. టాలీవుడ్ నుంచి ఈ అరుదైన గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక రికార్డునే క్రియేట్ చేసింది. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డు వేడుకల్లో భారత్ ను రిజ్రజెంట్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన రష్మికకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు అక్కడి ఫ్యాన్స్. టోక్యో ఎయిర్ ఫోర్ట్ లో రష్మిక కోసం గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారు. ఆమె ఫొటోలతో డిజైన్ చేసిన ప్లకార్డులు చూపిస్తూ.. రష్మికను ఆహ్వానించారు. ఎయిర్ ఫోర్ట్ లో తన అభిమానులు ఇచ్చిన వెల్కమ్ చూసి ఆశ్చర్యపోయింది రష్మిక.
National crush @iamRashmika was warmly welcomed by her fans in Tokyo❤️#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/lFWbaQLpvm
— Suresh PRO (@SureshPRO_) March 1, 2024
వారందరికీ హాయ్.. చెబుతూ సర్ ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : వరలక్ష్మీ నిశ్చితార్థం అయింది.. వరుడు ఎవరో తెలుసా ?