టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తారని హీరో శ్రీ విష్ణుకు పేరున్నది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటనను మొదలు పెట్టి హీరోగా ఎదిగారు శ్రీవిష్ణు. తన సినిమాలను సైలెంట్గా విడుదల చేస్తూ హిట్ కొడుతున్నారు. శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారుఎవరురా.. అప్పట్లో ఒకడుంటేవాడు ఇటీవల విడుదలైన రాజరాజచోర సినిమాలు హిట్ సాధించాయి.
Advertisement
డిపరెంట్ కథలతో వచ్చిన శ్రీవిష్ణు టాలీవుడ్తో హిట్లు కొట్టాడు. శ్రీవిష్ణు సినిమా వస్తుందంటే చాలా మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులు అనుకుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ అర్జున పాల్గుణ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోని పలు సన్నివేశాలు ఆడియెన్స్ను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్గా శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ లోని ఓ సన్నివేశమే శ్రీవిష్ణుకు తలనొప్పిని తెచ్చి పెట్టింది. సినిమాలో హీరోయిన్లు ఏమి చేస్తున్నారు అని అడగగా.. హీరోయిన్ గ్రామ వాలెంటరీగా పని చేస్తున్నాను అని బదులు ఇస్తుంది. దీనికి ప్రతీగా ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులిస్తారు అదేనా.? అని వెటకారంగా అడుగుతాడు. ఇప్పుడు ఈ డైలాగే చర్చకు దారి తీసింది.
Advertisement
గ్రామ వాలెంటర్ ఉద్యోగం గురించి చీప్గా మాట్లాడారంటూ ప్రజలు శ్రీవిష్ణును ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది గ్రామవాలంటీర్లు చేసిన సేవలను శ్రీవిష్ణుకు గుర్తు చేస్తున్నారు. మరికొంత మంది కరోనా కాలంలో వారు చేసిన సేవలను హీరో శ్రీవిష్ణుకు తెలియజేస్తున్నారు. కొంతమంది గ్రామవాలంటీర్ల సేవలకు సబంధించిన పేపర్ కటింగ్స్ పంపుతూ శ్రీవిష్ణును ట్యాగ్ చేస్తున్నారు. దీంతో సినిమా యూనిట్ ట్రబుల్లో పడింది. అయితే మేము సినిమాలో గ్రామవాలంటరీ ఉద్యోగాన్ని గౌరవంగానే చూపించామని, సినిమా చూస్తే తెలుస్తుందని చెబుతున్నారు. ఈ వివాదం ఎక్కడ, ఎప్పుడు ముగుస్తుందో చూడాలి మరీ.