Home » రెండుసార్లు సెన్సార్ అయి కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏదో తెలుసా ?

రెండుసార్లు సెన్సార్ అయి కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు మెగాస్టార్. చివరగా ఆగస్టు11న విడుదలైన భోళా శంకర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి కెరీర్ తో పాటు వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతాయి. కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీశాయి. అలాంటి ఓ సినిమా రెండు సార్లు సెన్సార్ కి వెళ్లి చిరంజీవి పరువును తీసింది.

Advertisement

అది మరేదో కాదండోయ్.. చిరంజీవి హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల్లుడా మజాకా. ఈ చిత్రంలో చిరంజీవి హీరో అయితే రమ్యకృష్ణ, రంభ హీరోయిన్స్ వీరి తల్లి పాత్రలో సీనియర్ నటి వాణిశ్రీని నటింప చేయాలని ముందుగా దర్శకుడు ఈవీవీ అనుకున్నాడట.  ఆమెను కలిసి పాత్రను వివరించాడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణి శ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా నటించారు. మరోసారి అల్లుడా మజాకా చిత్రంలో వాణి శ్రీకి అత్త పాత్రలో నటించే అవకాశం లభించినా ఆమె తిరస్కరించారు. వాస్తవానికి చిరంజీవి, వాణిశ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్ మూవీలో నటించారు. నటిగా వాణిశ్రీకి ఈ సినిమా రీ ఎంట్రీ మూవీ. అత్త, అల్లుడు పాత్రలో చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేవిధంగా వాణి శ్రీ నటించింది. ఓ రే**ప్ సీన్ లో నటించేటటువంటి సన్నివేశాలున్నాయి.

Advertisement

ఇక అవి నచ్చని వాణి శ్రీ మూవీలో నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ తరువాత దర్శక, నిర్మాతలు నటి లక్ష్మీతో ఆ పాత్రను చేయించారు.  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీ  మాదిరిగానే రిపీట్ చేయాలని ఈవీవీ సత్యనారాయణ, నిర్మాత దేవీ వరప్రసాద్ భావించినా వాణిశ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు. ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి కథ, మాటలు అదించారు. చివరికీ ఈ చిత్రం విషయంలో వాణి శ్రీ అంచనా వాస్తవమైంది. ఎందుకు అంటే ఓ రేప్ సీన్ లో రమ్యకృష్ణ, రంభ, వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే రేప్ సీన్ వివాదానికి కారణం అయింది. అదేవిధంగా ఈ చిత్రంలో లక్ష్మీ వేషాధారణ కూడా అంతగా బాగాలేదని కామెంట్స్ వినిపించాయి. చివరికీ రెండు సార్లు సెన్సార్ కి వెళ్లి కూడా చిరంజీవి పరువును తీసిన సినిమాగా మిగిలిపోయింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

శోభన్ బాబును ఆ విషయంలో జయలలిత తల్లి అంతలా అవమానించిందా..?

బాలకృష్ణను మోసం చేసిన వెంకటేష్ .. ఇన్నాళ్లకు ఇప్పుడు వెలుగులోకి..!

Visitors Are Also Reading