Home » మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..!

మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..!

by Anji
Published: Last Updated on
Ad

దీపావళి పండుగ త్వరలోనే రానుంది. దీపావళికి లక్ష్మీ దేవిని పూజిస్తారు. దీపావళి లక్ష్మీదేవి కి అంకితం చేయబడింది. లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపన్నమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే దీపావళి పండుగ రోజున మీ రాశి ప్రకారం లక్ష్మీ మంత్రాలను పటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.

Advertisement

ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ముందుగా మేషరాశి వారు “ఓం ఐం క్లీం సౌం అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. తర్వాత వృషభ రాశి వారు ఓం ఐం క్లీం శ్రీం అని మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే అప్పుల బాధ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మిధున రాశి వారు ఓం క్లీం ఐం మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి ఆరాధిస్తే ఆదాయం పెరుగుతుంది.మరియు డబ్బులు సమస్యలు తొలగిపోతాయి. కర్కటక రాశి వారు ఓం ఐం క్లీం శ్రీం ఈ మంత్రాన్ని జాపిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విషయాలలో విజయాలు సాధిస్తారు. తర్వాత సింహ రాశి వారు ఓం హ్రీం ఐం సౌం అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండ కలుగుతుంది. కన్య రాశి వారు లక్ష్మీదేవి పూజించేటప్పుడు ఓం శ్రీం ఐం సౌం నీ మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వలన కరుణాకటాక్షాలు కలుగుతాయి. తులారాశి వారు ఓం శ్రీం క్లీం హ్రీం సిద్ధలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ద్యానిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన జీవితం ఆనందం మరియు శ్రేయస్సు తో నిండి ఉంటుంది.

Advertisement

వృశ్చిక రాశి వారు ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే అమ్మవారి ఓం ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని జపిస్తూ పూజచేయాలి. దేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ధనస్సు రాశి వారు ఓం హ్రీం క్లీం సౌమ్ అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తో సానుకూల శక్తి మరియు అన్ని ప్రయత్నాలలో విజయం కలుగుతుంది. మకర రాశి వారు ఓం ఐం హ్రీం క్లీమ్ శ్రీం సౌం అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన త్వరలోనే ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటానికి కుంభ రాశి వారు ఓం హ్రీం ఐం క్లీమ్ శ్రీం అనే మంత్రాన్ని ద్యానించాలి. ఈ మంత్రాన్ని పాటించడం ద్వారా కుంభ రాశి వారు లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీనా రాశి వారు ఓం హ్రీం క్లీమ్ సౌం అనే మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇలా ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రం జపించడం వలన ఆర్థిక సమస్యల నుండి బయట పడవచ్చు.

Also Read :   దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading