అలనాటి నటి సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందం, అభినయం, నటన అన్నింటిలో ప్రతిభ కనబరిచేది. దేశవ్యాప్తంగా ఆమె గుర్తింపు పొందిన నటి అనే చెప్పవచ్చు. వెండి తెరపై ఆమె చెరగని ముద్ర వేసి చిన్న వయసులోనే కనుమరుగు అయిపోయింది నటి సౌందర్యను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. జూలై 18, 1972 న బెంగుళూరులో జన్మించిన సౌందర్య తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది.
read also : Rishabh Pant : ఢిల్లీ డగౌట్ లో రిషబ్ పంత్! ఎమోషనలైన ఫ్యాన్స్…
Advertisement
దాదాపు 12 సంవత్సరాల పాటు అగ్రనటిగా ఓ వెలుగు వెలుగు వెలిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం బెంగుళూరు నుంచి బయలు దేరింది. ఆమె ఎక్కిన విమానం ప్రమాదానికి గురై కనుమరుగైపోయింది. అయితే, తెలుగులో ఒక సీనియర్ హీరోను ఆమె పిచ్చిగా ఆరాధించిందని, ఎంతో ప్రేమించిందని కూడా అంటారు. ఆ హీరో ఎవరో కాదు జగపతిబాబు. జగపతిబాబు ఎవరిని నొప్పించని మనస్తత్వం, సౌందర్యం ఎంతో బాగా చూసుకోవడం, ఎవరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకపోవడం, అలాగే స్నేహం విషయంలో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడం, స్నేహితులకు అన్ని తానే ఖర్చు పెట్టుకోవడం, ఇలా ఎన్నో అంశాలు సౌందర్య జగపతిబాబు పట్ల ఆకర్షితురాలు అయ్యేలా చేశాయని అంటారు.
Advertisement
మరీ ముఖ్యంగా జగపతిబాబు సౌందర్య పట్ల ఎంతో స్పెషల్ కేర్ తో ఉండేవారట. తనపట్ల ఆ ప్రత్యేకమైన అభిమానం కూడా సౌందర్య జగపతిబాబు పట్ల ఇష్టాన్ని పెంచుకోవడానికి కారణం అయిందని అంటారు. అప్పటికే జగపతిబాబుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ సౌందర్య ఎందుకో జగపతిబాబును బాబు అంటూ పిలుస్తూ, బాగా ఇష్టపడేదని అప్పట్లో టాలీవుడ్ లో టాక్ అయితే ఉంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అందుకే సౌందర్య చనిపోయినప్పుడు కూడా జగపతిబాబు ఎంతో బాధపడ్డారు అని ఆయనే స్వయంగా చాలా సందర్భాలలో చెప్పారు.
READ ALSO : టాలీవుడ్ మరో విషాదం..సీనియర్ నటుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ కన్నుమూత