Home » నాగబాబుకు తెలియకుండా నిహారిక ఇంత పని చేసిందా.. కోపంతో రగిలిన నాగబాబు ఏం చేశారంటే..?

నాగబాబుకు తెలియకుండా నిహారిక ఇంత పని చేసిందా.. కోపంతో రగిలిన నాగబాబు ఏం చేశారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

మెగా డాటర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే తన చలాకి మాటలతో ఎన్నో బుల్లితెర షోలలో పాల్గొని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే తన కూతురికి కెమెరా ముందు నటించే భయం పోవడం కోసం ముందుగా బుల్లితెర వంటి షోలలో పరిచయం చేశారు.

ఢీ వంటి డ్యాన్స్ షో ద్వారా నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ క్రమంలో నాగబాబు జబర్దస్త్ షో ద్వారా అభిమానులకు ఇంకా దగ్గర అయిపోయారు. ఈ మధ్యకాలంలో నాగబాబు జబర్దస్త్ మల్లెమాల యాజమాన్యంపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.

ప్రస్తుతం , స్టార్ మా,జీ తెలుగు, యూట్యూబ్ ఛానల్, వంటి ఛానల్స్ వైపు చూస్తున్నారు కానీ మల్లెమాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తాజాగా మళ్లీ మల్లెమాల సంస్థ విడుదల చేసిన శ్రీ దేవి డ్రామా కంపెనీ మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక ఈ టీవీ మల్లెమాలలోకి మళ్ళీ అడుగు పెట్టింది. దీన్ని చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. ఇదేంటి నిహారిక మళ్లీ మల్లెమాలలోకి వచ్చింది, తండ్రి అక్కడ కూతురు ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ రాబోయే చిరంజీవి బర్త్ డే సందర్భంగా పాటలకు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారని చెప్పవచ్చు. నిహారిక కూడా హైపర్ ఆదితో తనదైన శైలిలో పోటాపోటీగా పంచులు వేస్తూ ఆ ప్రోమోలో అలరిస్తోంది.

నిహారిక రాకతో ప్రోమోకి కొత్త అందం వచ్చినట్లు కనబడుతోంది. ఈ షోని హైలెట్ చేయడం కోసం మల్లెమాల చేస్తున్న ట్రిక్స్ అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇన్నిరోజులు మల్లెమాలపై విపరీతంగా కామెంట్స్ చేసిన నాగబాబు మాత్రం నిహారికను మళ్లీ ఆ సంస్థ లోకి ఎందుకు పంపించారనే విషయమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ చాలా చర్చించుకుంటున్నారు.. కొంతమందేమో తన తండ్రికి శత్రువులా మారిన వారి దగ్గరికి నిహారిక వెళ్ళింది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading