Home » ఈ పండు తింటే మధుమేహం అదుపులో ఉండడం పక్కా..!

ఈ పండు తింటే మధుమేహం అదుపులో ఉండడం పక్కా..!

by Anji
Ad

ప్యాంక్రియాస్ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించినప్పుడు, ఆపేసినప్పుడు రక్తంలో చక్కర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో తరుచూ దాహం వేయడం, గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ మూత్ర విసర్జన కంటి చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా మధుమేహాన్ని వదిలించుకోవడానికి ఇంకా సమర్థవంతమైన చికిత్స అందుబాటులో లేదు.

Advertisement

అది ఒక్కసారి వస్తే దానిని అదుపులో ఉంచుకోవడమే పరిష్కారం. ఈ వ్యాధి నియంత్రణలో లేనప్పుడు శరీరంలోని ఇతర భాగాలను దెబ్బతీసేస్తుంది. దీనిని నివారించడానికి అల్లోపతి మందులతో పాటు ఆయుర్వేద చికిత్సను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండడం, శారీరక శ్రమను పెంచడం చాలా మంచిది. చలికాలంలో బేరి పండ్లు చాలా పుష్కలంగా లభిస్తుంటాయి. ఈ కాలంలో ఈ పండుకి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ పండు తినటానికి రుచిగా ఉండడమే కాదు.. మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. బేరిపండు మాత్రమే కాదు.. ఈ చెట్టు ఆకులు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. 

Advertisement

Also Read :   అంతర్జాతీయ క్రికెట్ లో ఉపయోగించే బంతి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఈ పండ్లు ఎంత తిన్నా బరువు పెరగరు. ముఖ్యంగా బేరీ ఆకుల్లో అద్భుతమైన ఔషద గుణాలుంటాయి. దీని ఆకు రసంలో యాంటి హైపర్ గ్లైసెమిక్ లక్షణాలుంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా జపాన్, చైనా, కొరియా, తైవాన్ లలో సహా పలు దేశాల్లో మధుమేహాన్ని నియంత్రించడానికి బేరి ఆకులతో చేసిన టీ ని వినియోగిస్తారు. డయాబెటిస్ పేషెంట్లు దీనిని తినవచ్చు. గుండె సంబంధిత సమస్యలున్న వారు కూడా బేరి పండ్లు తినవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి బేరి సీడ్ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు.. చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుచుతుంది. డయేరియాలో ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ టీని తీసుకోవడం వల్ల స్థూలకాయం, పొట్ట కొవ్వు క్రమంగా తగ్గుతుంది. 

Also Read :  చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ? 

Visitors Are Also Reading