Home » ధోనీ పోస్ట్ పై క్లారిటీ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..!

ధోనీ పోస్ట్ పై క్లారిటీ.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..!

by Sravya
Ad

ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక విజయాలను సొంతం చేసుకున్న టీముల్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. ఈ విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సీజన్లో కూడా తన సత్తా చాటడానికి చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమయింది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే చెన్నై టీం కెప్టెన్ అయిన మహేందర్ సింగ్ ధోని తన జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సంవత్సరం ఐపీఎల్ కి చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతోంది రీసెంట్ గా ధోని ఒక కొత్త అవతారంలో కనపడుతున్నట్లు ఒక ట్వీట్ చేశాడు దీంతో చాలా మందిలో ధోని ఈసారి చెన్నై టీం కి కెప్టెన్ గా మెంటర్ గా మారిపోతున్నాడా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి.

Advertisement

Advertisement

ఈ పోస్ట్ కి అర్థం ఏంటి అంటే జియో సినిమా కోసం ఆయన ఒక యాడ్లో కనిపించాడు. ఇక యాడ్ లో 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు ఇది చూసిన అభిమానులు ఇంతకుముందు ఆయన పెట్టిన పోస్ట్ లో అర్థం అదే అని ఆనందపడుతున్నారు. ముందేమో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరించకుండా మెంటర్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమో అని భయపడ్డారు. కానీ ఇది చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు ఫాన్స్.

ఇది ఇలా ఉంటే రీసెంట్ గా అనంత్ అంబానీ మ్యారేజ్ ఈవెంట్లో ధోని పాల్గొని సందడి చేశారు. ఇక దాని తర్వాత చెన్నైలో చెప్పాక స్టేడియంలో ప్రాక్టీస్ ని కూడా మొదలుపెట్టారు ధోని. ఏదేమైనా మొత్తానికి ధోని చెన్నై టీం లో ఆడబోతున్నాడు కప్పుని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంటున్నా లేదా అనేది చూడాలి. ఈసారి కనుక గెలిస్తే ఆరవ సారి చెన్నై టీం కి కప్పుని అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని నిలుస్తాడు. దాదాపు ఏడాది తర్వాత ధోనిని మరోసారి గ్రౌండ్లో చూడడానికి అభిమానులు విపరీతమైన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading