Home » అవినాష్ రెడ్డి, సిఎం జగన్ తో నాకు ప్రాణహాని ఉంది – దస్తగిరి సంచలనం

అవినాష్ రెడ్డి, సిఎం జగన్ తో నాకు ప్రాణహాని ఉంది – దస్తగిరి సంచలనం

by Bunty
Ad

అవినాష్ రెడ్డి, సిఎం జగన్ తో నాకు ప్రాణహాని ఉందని వైయస్ వివేకా కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ కుటుంబం నన్ను తొక్కాలని చూస్తోంది… నేను పులివెందుల లో జగన్ కాలనీలో నివాసం ఉంటున్నానని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గరలో నివాసం ఉంటున్న… సునీతమ్మ 75వేలు నాకు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

read also : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

Advertisement

 

నేను సునీతమ్మ దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోలేదు… సునీతమ్మ దగ్గర గానీ సిబిఐ దగ్గర నుండి గానీ డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు పోవడానికి సిద్దం అన్నారు. నిరూపించలేకపోతే మీరు మీ పదవులకు రాజీనామా చేసి జైలు కు వెళ్లే శక్తి మీకు ఉందా? వైయస్ కుటుంబానికి సవాల్ విసురుతున్నానని సవాల్ చేశారు.

Advertisement

Viveka Murder case: వారిద్దరి నుంచి ప్రమాదం పొంచి ఉంది: దస్తగిరి | dasta giri press meet about viveka murder case

మీ డ్రామాలు,మీ అక్రమాలకు సమయం దగ్గర పడింది… అవినాష్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ద్వారా నాకు ప్రాణహాని ఉందన్నారు. సిబిఐ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు… నీకు నచ్చిన కోణంలో ఎందుకు విచారణ చేస్తారన్నారు దస్తగిరి. వివేకా కేసులో మీ పాత్ర ఉందని సిబిఐ కి తెలుసు… అప్రూవర్ గా మారనంత వరకు దస్తగిరి మంచోడేనని చెప్పారు దస్తగిరి. అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దస్తగిరి చెడ్డవాడు గా కనిపిస్తున్నాడు… వివేకా కేసులో న్యాయం గెలవాలని కోరారు దస్తగిరి.

read also : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడిన సచిన్ కొడుకు.. అరుదైన రికార్డు కొట్టేశాడు!

Visitors Are Also Reading