Home » మ‌హేశ్, ప‌వ‌న్, ఎన్టీఆర్ ల 25వ సినిమాలో ఉన్న కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

మ‌హేశ్, ప‌వ‌న్, ఎన్టీఆర్ ల 25వ సినిమాలో ఉన్న కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ లు సైతం ఉన్నారు. టాలీవుడ్ లో మ‌హేశ్ బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్ ల మ‌ధ్య ఏ రేంజ్ లో పోటీ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ ముగ్గురిలో ఏ హీరో సినిమా వ‌చ్చినా ట్విట్ట‌ర్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంటారు.

Advertisement

అంతే కాకుండా ఈ ముగ్గురు హీరోల‌కు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్, ఎన్టీఆర్, మ‌హేశ్ లు న‌టించిన 25వ సినిమాలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది. అదేంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే.

Maharshi

Maharshi

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన 25 సినిమా నాన్న‌కు ప్రేమ‌తో ….సుకుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.

Advertisement

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కేఎంసీ అనే పైప్స్ కంపెనీకి సీఈవో గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన 25 సినిమా అగ్నాతవాసి. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఈవో గా న‌టించారు. ఏబీ అనే కంపెనీకి ప‌వ‌న్ క్లైమాక్స్ లో సీఈవోగా బాధ్య‌త‌ల‌ను తీసుకుంటారు. అదే విధంగా మ‌హేశ్ బాబు 25వ సినిమా మ‌హ‌ర్షి….ఈ సినిమాలో మ‌హేశ్ బాబు కూడా సీఈవో పాత్ర‌లో న‌టించారు. మ‌హేశ్ బాబు ఆరిజిన్ అనే కంపెనీకి సీఈవోగా క‌నిపించారు. ఈ ముగ్గురు హీరోల 25వ సినిమాల‌లో సీఈవో క‌నిపించ‌డం అనేది యాధృచ్చికంగా జ‌ర‌గ్గా ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు.

Visitors Are Also Reading