ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నటీనటుల రెమ్యునరేషన్ లు భారీగా పెరిగిపోయాయి. చాలా మంది హీరోలు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. హీరోయిన్ లతో పాటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో కూడా కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారు ఉన్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో లక్ష రూపాయల రెమ్యనరేషన్ అంటే చాలా గొప్పవిషయం. అతికొద్ది మంది స్టార్ హీరోలు మాత్రమే లక్ష రూపాయల రెమ్యునరేష్ ను అందుకునేవారు. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు కూడా ఉన్నారు.
Advertisement
అయితే వీరికంటే ముందే ఓ నటుడు లక్షరూపాయల రెమ్యునరేషన్ ను అందుకోవడం విషేషం ఆయనే పద్మశ్రీ చిత్తూరి నాగయ్య. చిత్తూరు జిల్లాలో జన్మించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో చిత్తూరి నాగయ్యగానే పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు ఉప్పులపూడి నాగయ్య శర్మ కాగా ఆయన బ్రాహ్మణకుటుంబానికి చెందినవారు.
Advertisement
నాగయ్య బాల్యమంతా తిరుమల తిరుపతిలోనే జరిగింది. చదువు అనంతరం నాగయ్య ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేశారు. అంతే కాకుండా ఆంధ్రా పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఇక నటన పై ఉన్న ఆసక్తితో నాగయ్య గృహలక్ష్మి అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాకే ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ తరవా వందేమాతరం, దేవత, భక్త పోతన లాంటి సినిమా ద్వారా పాపులర్ అయ్యారు.
నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నాగయ్య పనిచేశారు. మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఎదుగున్న నాగయ్యను పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. ఎన్టీఆర్,ఏఎన్ఆర్ సినిమాల్లోకి రాకముందే నాగయ్య భారీ రెమ్యునరేషన్ పుచ్చుకునేవారు. అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ చూసి అంతా షాక్ అయ్యేవారు. ఒక్కో సినిమాకు నాగయ్య లక్ష రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది.