Home » పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి చిరంజీవి సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి చిరంజీవి సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు చిరంజీవి. తాజాగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరువుతున్నాడు చిరంజీవి. ఆ ఇంటర్వ్యూలలో ముఖ్యంగా సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలేఎదురవుతున్నాయి. 

Advertisement

 

ముఖ్యంగా చిరంజీవి చిన్న తమ్ముడు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నవిషయం అందరికీ తెలిసిందే. పలువురు యాంకర్స్ అడిగే ప్రశ్నలలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినవే ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వూలో చిరంజీవికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు చిరు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా  ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. దాని గురించి చిరంజీవిని యాంకర్ ప్రశ్నించగా.. “నేను దాని గురించి ఏమి మాట్లాడను. ఎందుకంటే నిజానిజాలు ప్రజలకు తెలుసు. ఎవ్వరు ఏది మాట్లాడినా సరే.. వాళ్ళకి ఆ విచక్షణ ఉంది. వారు అర్థం చేసుకోగలరు. లేకపోతే ఇంత ఆదరణ కళ్యాణ్ బాబుకి ఉండదు. పొలికల్ గా ఒకరినొకరు ఏమి విమర్శించుకుంటారో నాకు అవసరం లేదు. నేను కామెంట్ చేయను. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నాను.. తప్ప నా తమ్ముడికి దూరంగా ఉండడం లేదు” అని చిరంజీవి స్పష్టం చేశారు.  

Advertisement

Also Read :   30 ఏళ్ల తరువాత బాలకృష్ణకి ఆ లోటు తీరిందా..?

Manam News

అదేవిధంగా రాజకీయాల గురించి కూడా కొన్ని ఆసక్తి కరమైన విషయాలను చెప్పారు. తాను పాలిటిక్స్ మీద దృష్టి పెట్టలేదని, పాలిటిక్స్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. పాలిటిక్స్ ఎంతో మంది ఎన్నో చేస్తారు. కానీ తిరిగి వారు గెలుస్తారో లేదో అనే గ్యారంటీ ఇవ్వలేరని, ఎన్ని చేసినా పాలిటిక్స్ అనేది ఇట్స్ వెరీ ట్రిక్కింగ్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టుగానే.. పవన్ కళ్యాణ్ కాపులను కమ్మల్లకు అమ్మేస్తాడని రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ దానిపై యాంకర్ ప్రశ్నించగా.. చిరంజీవి ఈ విషయం గురించి తాను వినలేదని.. రాజకీయాల గురించి అవసరం లేదని సమాధానమిచ్చాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ గురించి నేను ఏం మాట్లాడనని.. రామ్ గోపాల్ వర్మ నైజం మీద తనకు ఏం రైట్ ఉంటుందని చెప్పారు. చిరంజీవి గురించి ఏంటి అనేది ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.  

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ నటించిన టార్జాన్ మూవీ ఏదో తెలుసా..?

Visitors Are Also Reading