Home » చిరంజీవి: అందుకే మెగాస్టార్ అయ్యారా..?

చిరంజీవి: అందుకే మెగాస్టార్ అయ్యారా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే దాదాపుగా దేశ‌వ్యాప్తంగా అంద‌రికీ ప‌రిచ‌య‌మే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే త‌త్వం హీరో చిరంజీవిది. ఇండ‌స్ట్రీలో మెగాస్టార్‌గా ఎదిగిన‌ప్ప‌టికీ ఆ కీర్తి కిరిటాల‌ను త‌ల‌కు ధ‌రించ‌లేదు. త‌న చుట్టూ ఉండే వారిని ఎంతో ఆప్యాయంగా న‌వ్వుతూ ప‌ల‌కరిస్తారు. సాయం అని చేయి చేస్తే.. ఆయ‌న‌కు తోచిన మేర‌కు ఆదుకుంటారు. ఇక చిరంజీవి ఉన్న‌త వ్యక్తిత్వానికీ అద్దం పట్టే వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో కోకొల్ల‌లు. మెగాస్టార్ గొప్ప‌త‌నాన్ని చాటే కొన్ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు చిరంజీవిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Also Read :  బాలయ్య పెళ్లికి రానని చెప్పిన ఎన్టీఆర్… కారణం ఏంటో తెలుసా…!

Advertisement

Advertisement

కొన్ని రోజుల క్రితం చిరంజీవికి క‌రోనా భారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. కోలుకున్న త‌రువాత ఆయ‌న త‌న భార్య సురేఖ‌తో క‌లిసి ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు. దానిలో భాగంగా కేర‌ళ‌లోని ప‌లు దేవాల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ఈ త‌రుణంలో ఆదివారం చిరంజీవి శ‌బ‌రిమ‌ల వెళ్లి.. త‌న ఇష్ట‌దైవం అయ్య‌ప్ప స్వామిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల ర‌ద్దీ ఎక్క‌వగా ఉండ‌డంతో చిరంజీవి డోలీలో ప్ర‌యాణించారు. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న త‌రువాత త‌న‌ను డోలీలో మోసిన శ్రామికుల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రించారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇక చిరంజీవి-సురేఖ దంప‌తులు సోమ‌వారం గురువాయూర్ శ్రీ‌కృష్ణ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. చిరంజీవి, ఆయ‌న కుమారుడికి అయ్య‌ప్ప స్వామి ప‌ట్ల విశ్వాసం ఎక్కువ‌. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల ధ‌రించే సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఫొటోలపై ఇప్ప‌టికే ప‌లువురు కామెంట్లు తెలుపుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా కామెంట్స్ జోడించండి.

Also Read :  ఐపీఎల్ మెగా వేలంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన‌ కావ్య‌మార‌న్ గురించి తెలుసా..?

Visitors Are Also Reading