Home » chiranjeevi: మెగాస్టార్ ను 24 సార్లు చెంపదెబ్బ కొట్టిన కథానాయిక.. అసలు కారణం ఇదేనా..?

chiranjeevi: మెగాస్టార్ ను 24 సార్లు చెంపదెబ్బ కొట్టిన కథానాయిక.. అసలు కారణం ఇదేనా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఆయన తన కృషి, పట్టుదల తో ఇండస్ట్రీలో ఎదిగారు. ఎంతో కష్టపడి మెగాస్టార్ గా మారారు. అందుకే చిరంజీవి అంటే ఎంతోమంది అభిమానులు ఇష్టపడతారు. అలా చిరంజీవితో అనేక సినిమాల్లో చేసి క్రేజీ కాంబో గా గుర్తింపు పొందారు రాధిక. 40 సంవత్సరాల సినీ పరిచయంలో వీరి మధ్య మంచి సంబంధం ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మరియు కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:jayaprda:142 చీరలతో జయప్రద సృష్టించిన సరికొత్త రికార్డ్..ఏంటంటే..?

Advertisement

న్యాయం కావాలి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక చిరంజీవితో మొదటిసారిగా నటించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో వీరి కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఈ విధంగా వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పెరిగింది. వీరిపై అప్పట్లో అనేక రూమర్స్ కూడా వచ్చాయట. కానీ మా మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని రాధిక తెలియజేసింది. అయితే న్యాయం కావాలి సినిమా కథలో భాగంగా చిరంజీవి చెంపపై గట్టిగా కొట్టాలి.

ఈ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. మొత్తం 24 టేక్స్ తీసుకున్నాను. అలా చిరంజీవిని 24 సార్లు చెంపపై గట్టిగా కొట్టాను. పాపం ఆయన చెంప కందిపోయి ఎర్రగా ఉబ్బిందని మరోసారి గుర్తు చేసింది. దీంతో నేను ఆయనకు వెళ్లి సారీ చెప్పాను. దీంతో ఆయన పరవాలేదు అమ్మా నా చెంపను బాగానే వాయించావు అంటూ నవ్వారట. ఈ విషయాన్ని రాధిక ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

also read:

Visitors Are Also Reading