Home » జగన్ కిమ్ బ్రదర్…నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారు – చంద్రబాబు

జగన్ కిమ్ బ్రదర్…నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారు – చంద్రబాబు

by Bunty
Ad

 

జగన్ కిమ్ బ్రదర్…నవ్వినా కొడతారు.. ఏడ్చినా కొడతారంటూ ఫైర్ అయ్యయారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఇవాళ మీడియాతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఓ పక్క దోచుకుంటూ.. మరో పక్క స్లోగన్లు ఇస్తారా..? అని జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేసి కూడా అనవసరమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణంపై టైమ్ బాండ్ ప్రొగ్రాం పెట్టుకుని పని చేస్తామని తెలిపారు.

Advertisement

ఇది చెత్త గవర్నమెంట్… బటన్ నొక్కితే అమ్మఒడి వెళ్తోందా..? రూ. 13 వేలు ఇస్తున్నామంటూ బటన్ నొక్కి.. రూ. 5 వేలు వేస్తారా..? అంటూ రెచ్చిపోయారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ నొక్కేది ఉత్తుత్తి బటనే… అసలు బటన్ సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్సులో నొక్కుతాడంటూ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రలో జగన్ ప్రభుత్వ దొపిడీ రూ. 40 వేల కోట్లు.. ఆ డబ్బును ప్రాజెక్టులకు ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేవి అని నిలదీశారు.

Advertisement

మంత్రులు.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అవినీతిలో భాగస్వాములు అవుతున్నారని మండిపడ్డారు. అవినీతితో వైసీపీ నేతల పొట్టలు పెరుగుతున్నాయి కానీ.. ప్రాజెక్టుల కోసం నిధులు ఉండవా..? అని నిలదీశారు. వనరుల దోపిడీతో ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపించారు. జగనుకు డబ్బుల ఆశ.. ప్రతి రోజూ తాడేపల్లి కొంపకు డబ్బులు రావాల్సిందేనని చెప్పారు. వైసీపీకి మనీ మానియా పట్టింది… పేదలకు పెత్తందార్లుకు పోరాటమా..? అని అగ్రహించారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు….!

India Squad of World Cup 2023 : సంజూ, ధావన్‌కు చోటు.. సూర్య ఔట్ ?

అంతా తొండాటే…. పేరుకే పాకిస్తాన్ యువ జట్టు… అందరూ అంకుల్సే ?

Visitors Are Also Reading