Home » చైతన్య మాస్టర్ మృతి పై ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు….!

చైతన్య మాస్టర్ మృతి పై ఆయన తల్లి సంచలన వ్యాఖ్యలు….!

by AJAY
Ad

ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో కానీ చైతన్య మాస్టర్ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢీ షో లో మాస్టర్ గా చైతన్య ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన డాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే చైతన్య మాస్టర్ తనకు అప్పులు ఎక్కువ అయ్యాయని…

Advertisement

అప్పులు తీర్చలేక ఇతరులను ఇబ్బంది పెడుతున్నానని అన్నాడు. అప్పుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చైతన్య మాస్టర్ చాలా మంచివాడు అంటూ ఢీ షో జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ శ్రద్ధాదాస్ తెలిపింది.

Advertisement

ఆయన తన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అనుకుంటారని పేర్కొంది. ఇదిలా ఉంటే చైతన్య మాస్టర్ మృతిపై అతని తల్లి లక్ష్మీరాజ్యం స్పందించారు. చైతన్య చనిపోయే ముందు 15 నిమిషాల పాటు తనతో ఫోన్ లో మాట్లాడాడు అని చెప్పారు. గుడికి వెళ్లాలన్నాడు డబ్బుల కోసమే చనిపోతున్నానని అనడం నాకు నచ్చలేదని అన్నారు. అడిగితే నేను ఇవ్వనా…. డప్పుల విషయం ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదని అన్నారు. తనతో పాటు నన్ను కూడా రమ్మంటే నేను పోయేదాన్ని… వాడు చనిపోయాడనే దానికంటే నాకు ద్రోహం చేశాడు అని చైతన్య మాస్టర్ తల్లి బాధపడ్డారు.

Visitors Are Also Reading