Home » స్టార్ అవ్వాల్సిన గిరిబాబు కొడుకు చిరంజీవి వ‌ల్ల ఎద‌గ‌లేక‌పోయాడా..? అస‌లేం జ‌రిగింది..?

స్టార్ అవ్వాల్సిన గిరిబాబు కొడుకు చిరంజీవి వ‌ల్ల ఎద‌గ‌లేక‌పోయాడా..? అస‌లేం జ‌రిగింది..?

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంత మంది సీనియ‌ర్ న‌టుల వార‌సులు కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుని న‌టులుగా స‌క్సెస్ అయ్యారు. అయితే మ‌న‌కు మాత్రం స్టార్ హీరోల కొడుకులు కుమార్తెలు మాత్ర‌మే తెలుసు. అయితే చాలా మందికి సుప‌రిచితుడు అయిన ప్ర‌ముఖ న‌టుడు గిరిబాబు కుమారులు కూడా టాలీవుడ్ లో రానిస్తున్నార‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. గిరిబాబు ఒక‌ప్ప‌టి స్టార్ హీరోల సినిమాలలో విల‌న్ గా నటించి త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

Advertisement

వంద‌ల చిత్రాల‌లో న‌టించి విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వ‌య‌సు పై బ‌డినా కూడా ఇప్ప‌టికీ ఆయ‌న యాక్టివ్ గా క‌నిపిస్తూ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇక గిరిబాబు ఇద్ద‌రు కుమారులు కూడా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న పెద్ద కుమారుడు మ‌నంద‌రికీ తెలిసిన క‌మెడియ‌న్ ర‌ఘుబాబు గారే. ఆయ‌న కూడా వంద‌ల చిత్రాల‌లో న‌టించి న‌టుడుగా క‌మెడియ‌న్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్ప‌టికీ ప‌లు చిత్రాల‌లో క‌మెడియ‌న్ గా న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

ఆయ‌న కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉండ‌గా గిరిబాబు మ‌రోకుమారుడు బోసుబాబు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గిరిబాబు త‌న కొడుకు బోసుబాబును హీరోగా చేయాల‌ని స్వీయ నిర్మాణంలో ఇంద్రజిత్ అనే సినిమాను నిర్మించాడు. కాగా ఈ సినిమా చిరంజీవి హీరోగా న‌టించిన కొద‌మ‌సింహం సినిమా రెండూ ఒక నెల అటూ ఇటూగా విడుద‌లయ్యాయి.

కాగా రెండు సినిమాల్లోనూ క‌థ దాదాపుగా ఒకే విధంగా కనిపించింది. దాంతో ఈ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు ఆందోళ‌న చేశారు. అంతే కాకుండా స‌గం డ‌బ్బుల‌ను వెన‌క్కి తీసుకున్నారు. అలా జ‌ర‌గ‌టంతో బ‌య్య‌ర్లు లాభ‌ప‌డ్డారు కానీ నిర్మించిన గిరిబాబు న‌ష్ట‌పోయారు. అప్ప‌ట్లో ఈ సినిమా విష‌యంలో కుట్ర జ‌రిగింద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఓ ఇంట‌ర్యూలో ఆ విష‌యాన్ని బోసు బాబు చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సినిమా త‌ర‌వాత రెండు మూడు సినిమాలు చేసినా బోసుబాబుకు స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఇక బోసుబాబు ఆ త‌ర‌వాత విల‌న్ గా న‌టించగా ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నారు.

Visitors Are Also Reading