నటి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. ఇండియా అంతటా అతిలోకసుందరిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి శ్రీదేవి. ఎన్నో సినిమాలలో ఎందరో గొప్ప గొప్ప నటులతో కలిసి నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన అద్భుతమైన నటన, అమాయకత్వం, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక తన నటనకుగాను ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక శ్రీదేవి మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈమె మరణవార్త తెలిసి చాలామంది ప్రేక్షకులకు గుండెలు పగిలాయి. తన మరణాన్ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. శ్రీదేవి మరణం ఓ మిస్టరీగా మారింది.
Boney Kapoor Reveals Sridevi Was On Extreme Diet Plan
తనది సహజమరణం కాదని ఎవరో కావాలని హ**త్య చేశారని ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలపై ఇప్పటికి తన కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేదు. ఇక తాజాగా తన భర్త బోనీ కపూర్ శ్రీదేవిది సహజమరణం కాదని ప్రమాదవశాత్తు చనిపోయిందని చెప్పుకొచ్చాడు. 2018లో శ్రీదేవి తన కుటుంబ సభ్యుల వివాహానికి దుబాయ్ కి వెళ్ళింది. అక్కడే బాత్రూం లో జారిపడి మరణించింది. ఇక శ్రీదేవి మరణానికి తన భర్తనే కారణం అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయాలపై ఇప్పటివరకు స్పందించని బోనీకపూర్ తాజాగా ఓ నేషనల్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది.
Advertisement
Advertisement
సినిమాల్లో అందంగా కనిపించాలని శ్రీదేవి చాలా డైట్ ను ఫాలో అయ్యేది. చాలా కఠినమైన డైట్ లో భాగంగా ఉప్పులేని ఫుడ్ నీ తినేది. దాంతో చాలా సమస్యలు వచ్చేవి. శ్రీదేవి ఉప్పులేని ఆహారం తినడం వల్ల తనకు లోబీపీ వచ్చి చాలా సార్లు కింద పడిపోయింది. అయినప్పటికీ తాను ఎంత చెప్పినా కూడా వినేది కాదు. ఇక శ్రీదేవి మరణ సమయంలో ఈ విషయాలు చెప్పడం నావల్ల కాలేదు. అన్ని వైపుల నుంచి నాపై ఒత్తిడి పడింది. నిజంగా శ్రీదేవి మరణం నాకు, నా కుటుంబ సభ్యులకు తీరని లోటును ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు బోనీకపూర్.
ఇవి కూడా చదవండి
- పవన్ కల్యాణ్ నటికి విడాకులు .. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?
- ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి
- ‘బిగ్బాస్’ హరితేజ విడాకులు.. ఒక్క పోస్ట్తో క్లారిటీ …!