Home » బిగ్ బాస్ నిర్వాహకులు కీలక నిర్ణయం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బిగ్ బాస్ నిర్వాహకులు కీలక నిర్ణయం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

బిగ్ బాస్ తెలుగు షో నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు వంటివి చేయకూడదని నిర్ణయించారట. ఈ విషయాన్ని అగ్రిమెంట్‌లో కూడా పొందుపరచనున్నారని సమాచారం. ఈ షాకింగ్ నిర్ణయానికి సంబంధించిన వివరాల లోకి వెళితే.. బిగ్ బాస్ 7 సీజన్‌లో పాల్గొని విజేతగా పల్లవి ప్రశాంత్‌ నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ స్టూడియో దగ్గరకి భారీగా వచ్చి చేరుకున్నారు. మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడారు. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు. అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని కుటుంబం పయనిస్తున్న కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు శాంతి భద్రల నేపథ్యంలో ప్రశాంత్‌ను వెళ్లిపోమ్మంటే.. నేను దొంగతనం చేసిన్నా.. నేనేందుకు వెళ్లాలి. రైతుబిడ్డకు గౌరవం ఇవ్వట్లేదు అని పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెళ్లిన ప్రశాంత్ మళ్లీ ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చి ర్యాలీ తీశాడు.

Advertisement

ర్యాలీ తీసిన సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 రోజులు రిమాండ్‌ కూడా విధించారు. 4 రోజులు చంచల్ గూడా జైలులో గడిపిన ప్రశాంత్ ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేసు విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు సైతం పోలీసులు నోటీసులు పంపించారు. ఇప్పటికే బిగ్ బాస్‌పై వ్యతిరేకత వస్తుండగా తాజాగా పోలీసుల నోటీసులు తలనొప్పిగా మారింది. దీంతో.. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు వంటివి చేయకూడదని నిర్ణయించారట. మొత్తానికి పల్లవి ప్రశాంత్ వల్ల బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడూ తీసుకోని డెసిషియన్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading