టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కు నిర్మాతలు షాక్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పూజాహెగ్డే ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా పూజాకు మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో సింపుల్ గా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ పూజా హెగ్డే అభిమానులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తరవాత అందం అభినయం వల్ల చాలా సినిమాల్లో పూజాహెగ్డేకు ఆఫర్ లు వచ్చాయి.
Advertisement
కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠపురం సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఆ తరవాత పూజా గ్యాప్ లేకుండా వరుస ఆఫర్ లు అందుకుంది. కానీ ఈ అమ్మడికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టు కనపిస్తోంది. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా లెవల్ తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయ్యింది.
Advertisement
అంతేకాకుండా విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోనూ బుట్టబొమ్మనే హీరోయిన్ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో పాటూ రీసెంట్ గా దిల్ రాజు నిర్మాణంగా విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
అంతే కాకుండా ఆచార్య సినిమా కూడా ఫ్లాప్అయ్యింది. ఇలా వరుస ఫ్లాప్ లు రావడంతో పూజా హెగ్డేకు నిర్మాతలు షాక్ ఇచ్చినట్టు తెలస్తోంది. ప్రస్తుతం పూజా రూ.3 నుండి 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఆ రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటేనే సినిమాల్లో ఆఫర్ లు ఇస్తామని నిర్మాతలు కండిషన్స్ పెట్టినట్టు టాక్.