Home » Virupaksha: విరూపాక్ష దర్శక నిర్మాతలకు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..?

Virupaksha: విరూపాక్ష దర్శక నిర్మాతలకు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..?

by Sravanthi Pandrala Pandrala
Ad
 మెగా కుటుంబానికి చెందిన హీరోగా  సాయి ధరంతేజ్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల హోదాలో  చేరుతున్నారని చెప్పవచ్చు. గత కొన్ని నెలల క్రితం  సాయి ధరమ్ తేజ్  బైక్ యాక్సిడెంట్ కారణంగా  తీవ్రంగా గాయపడి కోలుకొని కం బ్యాక్ ఇచ్చారు. దీని తర్వాత విరూపాక్ష మూవీ చేసి  దూసుకు పోతున్నారు. కొత్త డైరెక్టర్ కార్తీక్ దండు, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే  టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే  అందించారు. వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్ లో బి వి ఎస్ ఎన్ ప్రసాద్  సుకుమార్ కలిసి నిర్మించారు.  ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీస్ లోకనాథ్  సంగీతాన్ని సమకూర్చారు.
ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా థియేటర్లో ఈ మూవీకి  వస్తున్న రెస్పాన్స్ చూసేందుకు నిర్మాత ప్రసాద్, దర్శకుడు కార్తీక్ హైదరాబాదులోని పలు థియేటర్లను  సందర్శించారు. ఇక ఈ ప్రయాణంలో కార్తీక్ ఫోన్  ఎవరో కొట్టేసారట.  అలాగే నిర్మాత ప్రసాద్ పర్స్ కూడా పోయిందట. అయితే ప్రయాణ సమయంలో రెండు  ఎక్కడ మిస్ అయ్యాయో తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లలేదని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సాయిధరమ్ తేజ్ మూవీ విషయానికి వస్తే  ఫస్ట్ డే 12 కోట్ల రూపాయలు వసూలు చేసి  సాయి ధరంతేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద  మొదటి రోజు  200k డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం తెలుగులో మాత్రమే రిలీజ్ చేసిన ఈ మూవీ త్వరలో అన్ని భాషల్లో రానున్నట్టు సమాచారం.  సినిమా సక్సెస్ అవడంతో మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Visitors Are Also Reading