Home » Big Boss 7 Telugu Season: బిగ్ బాస్ “పల్లవి ప్రశాంత్” ఎవరు? అతనిని ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు?

Big Boss 7 Telugu Season: బిగ్ బాస్ “పల్లవి ప్రశాంత్” ఎవరు? అతనిని ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు?

by Srilakshmi Bharathi
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. తాజాగా బిగ్ బాస్ 7 సీజన్ మొదలైంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఉల్టా పల్టా అంటూ ఈ సీజన్ ను కింగ్ నాగార్జున చాలా హుషారుగానే స్టార్ట్ చేసారు.

Advertisement

ఈ సారి కంటెస్టెంట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కొంతమంది ఇతనిని ట్రోల్ కూడా చేస్తున్నారు. అసలు పల్లవి ప్రశాంత్ ఎవరు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబర్ గా పల్లవి ప్రశాంత్ చాలా పాపులర్ అయ్యాడు. యు ట్యూబ్ లో తాను రైతు బిడ్డని అని, బిగ్ బాస్ కి వెళ్లడం తన కల అని చెబుతూ వీడియోస్ చేసేవాడు.

Advertisement

ఈ వీడియోస్ పాపులర్ అయ్యి నిజంగానే అతనికి బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వచ్చింది. తాను రైతు బిడ్డని అని చెప్తూ అతను చాలా ఎమోషనల్ వీడియోస్ తీసేవాడు. తాను అనుకున్నట్లే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ లోకి వస్తూనే ఓ మూట బియ్యం తీసుకుని వచ్చి నాగ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. అవి తాను సొంతంగా పండించిన బియ్యం అని తెలిపాడు. అతనికి వారానికి లక్ష రూపాయలు రెమ్యునరేషన్ అట. అతను ఎన్ని వారాలు హౌస్ లో ఉండి ఆడగలిగితే అన్ని లక్షలు వస్తాయని అన్నమాట. అయితే.. ఆయన పై ట్రోలింగ్ కూడా ఎక్కువగానే జరుగుతోంది. జస్ట్ వీడియోస్ తోనే పాపులర్ అయిపోయి బిగ్ బాస్ కు వచ్చేయడం పై నెటిజన్స్ పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్ చాలా ఫన్నీ గా ఉంటున్నాయి. ఈ కింద ట్రోలింగ్ వీడియో ను మీరు కూడా చూసేయండి.

Visitors Are Also Reading