Bhumika : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతారు. అందులో భూమిక ఒకరు. హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో సౌందర్య అలాగే హీరోయిన్ భూమిక కూడా చాలా సంప్రదాయకారంగా కనిపించేది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా పాపులర్ అయింది భూమిక.
ఇక పవన్ కళ్యాణ్ సరసన చేసిన ఖుషి సినిమా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ గానే భూమిక కేరీలో మిగిలిపోయింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమా చేసి బంపర్ విజయాలను అందుకుంది అలనాటి హీరోయిన్ భూమిక. ఇక ఇటీవల నాని చేసిన ఎంసీఏ సినిమాలో వదిన పాత్రలో కనిపించి అందర్నీ కనువిందు చేసింది హీరోయిన్ భూమిక. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వదిన లేదా తల్లి పాత్రలు కనిపిందు చేస్తోంది.
Advertisement
ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ భూమిక కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై కొత్త బిజినెస్ ప్రారంభం చేసేందుకు సిద్ధమైందట భూమిక. అది కూడా గోవాలో అని పేర్కొంది భూమిక. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించింది. గోవాలో మా కొత్త వెంచర్ సమర వెల్నెస్ హోటల్ ప్రారంభించాం… ఎంజాయ్ మెంట్ కోసం అలాగే మంచి ఫుడ్ కోసం మా హోటల్ కు రావాలి అని పోస్ట్ పెట్టింది భూమిక. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!