మెగాస్టార్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలలో అంజి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. 2004లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అదే ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా మరియు బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీనరసింహ సినిమాలు కూడా విడుదలయ్యాయి.
ALSO READ : భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ “భీమ్లానాయక్” పై ఎందుకు…?
Advertisement
అయితే ఈ రెండు సినిమాలకు కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అంతే కాకుండా అంజి సినిమా వల్ల నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి….నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నష్టపోవడానికి కారణం ఎవరు..? అసలు ఈ సినిమా ఎలా మొదలయ్యింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవి టాగూర్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తరవాత ఆయనతో ఓ గ్రాఫిక్ సినిమా చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పి ఆయన డేట్స్ కూడా తీసుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా చేసే బాధ్యతలను దర్శకుడు కోడి రామకృష్ణకు అప్పగించారు. అయితే కోడి రామకృష్ణ మాత్రం తన వద్ద ఓ మంచి స్క్రిప్ట్ ఉందని ఆ కథలో హీరో డబుల్ రోల్ చేస్తాడని చెప్పారట.
కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు గ్రాఫిక్ సినిమానే కావాలని పట్టుపట్టారట. దాంతో కోడి రామకృష్ణ చిరంజీవిని అయినా ఒప్పిద్దామని ఆయన వద్దకు వెళ్లారట. కానీ చిరు కూడా గ్రాఫిక్ సినిమానే చేద్దామని చెప్పారట. ఇక చేసేది లేక కోడిరామకృష్ణ ఎంతో కష్టపడి ఆయన కోసం అంజి కథను రెడీ చేశారట. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ కూడా ఎంతో కష్టపడ్డారట. ఓ ఇంటర్వ్యూలో కోడిరామకృష్ణ ఈ సినిమా గురించి చెబుతూ సినిమా ఎలా ఉన్నా తనకు అంజి సంతృప్తిని ఇచ్చిందన్నారు.