Home » రికార్డులతో బాలీవుడ్ కి చమటలు పట్టించిన బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా “సమర సింహ రెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా ?

రికార్డులతో బాలీవుడ్ కి చమటలు పట్టించిన బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా “సమర సింహ రెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ad

యాక్ష‌న్ సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఎంతో మంది హీరోలు యాక్ష‌న్ సినిమాలు చేశారు. కానీ బాల‌య్య మాత్రమే ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సాధించుకున్నారు. బాల‌య్య యాక్ష‌న్ సినిమాలంటే బాలీవుడ్ జ‌నాలు సైతం ఎంతో ఎంజాయ్ చేస్తారు. అందుకే బాల‌య్య హీరోగా న‌టించిన సినిమాల‌ను హిందీలో డ‌బ్ చేస్తే మిలియ‌న్స్ లో వ్యూవ్స్ వ‌స్తుంటాయి. అంతే కాకుండా టాలీవుడ్ లో ఫుల్ లెన్త్ ప‌క్కా యాక్ష‌న్ సినిమా వ‌చ్చింది కూడా బాల‌య్య హీరోగానే. స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాతో బాల‌య్య అస‌లైన యాక్ష‌న రుచిని టాలీవుడ్ కు చూపించాడు.

samarasimhareddy

Advertisement

 

ఈ సినిమా కంటే ముందు శార‌ద‌, ప్రేమించుకుందాం రా సినిమాలు వ‌చ్చాయి కానీ ఫుల్ లెన్త్ యాక్ష‌న్ సినిమాలు కాదు. కానీ స‌మ‌ర‌సింహారెడ్డి యాక్ష‌న్ సినిమా గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్ర‌ముఖ ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌ను అందించారు. అంతే కాకుండా ఈ సినిమాకు బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మ‌ర‌సింహారెడ్డి కి ముందు బి.గోపాల్ వ‌రుస ఫ్లాప్ ల‌తో స‌త‌మతం అవుతున్నాడు. అంతే కాదు వ‌రుస ఫ్లాప్ లు రావ‌డంతో నిరాశ చెంది ఇంట్లోనే ఉండిపోయారు. అలాంటి స‌మ‌యంలో విజ‌యేంద్రప్ర‌సాద్ ఒక‌రోజు బి.గోపాల్ఇంటికి వెళ్లారు.

Advertisement

మీకు చాలా న‌చ్చిన సినిమా ఏంట‌ని బి.గోపాల్ ను అడిగారు. దానికి బి. గోపాల్ గుండ‌మ్మ క‌థ అని ఆన్స‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా గుండ‌మ్మ క‌థ సినిమాకు హిందీ సినిమా దుష్మ‌న్ క‌లిపితే బాగుంటుంద‌ని కూడా అన్నార‌ట‌. దాంతో ఐడియా చాలా బాగుంద‌ని త‌న‌కు ఒక వారం స‌మ‌యం కావాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వెళ్లిపోయార‌ట‌. ఇప్పుడు ఆ రెండు సినిమాల‌ను క‌ల‌ప‌డం ఎలా అనే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఆ త‌ర‌వాత క‌థ రాసుకుని చెప్పిన‌ట్టే బి.గోపాల్ కు క‌థ‌ను అందించారు.

కొన్ని సీన్ల‌ను విజ‌య‌వాడ‌లో నిజంగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకున్నారు. ఇక ఈ క‌థ‌ను చెన్నైలో ఉన్న బాల‌య్య వ‌ద్ద‌కు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, బి.గోపాల్ వెళ్లి చెప్పార‌ట‌. క‌థ విన్న త‌ర‌వాత బాల‌య్య త‌న‌కు రెండు రోజులు స‌మ‌యంలో కావాల‌ని చెప్ప‌డంతో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ లేచి వెళ్లిపోయార‌ట‌. కానీ బీ. గోపాల్ సినిమా గురించి ప‌లు విష‌యాలు చెప్పిఒప్పించారు. అలా స‌మ‌ర‌సింహారెడ్డి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ALSO REAd :

అంద‌రికీ న‌చ్చిన ఖ‌లేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది…5 కార‌ణాలు ఇవేనా..!

Visitors Are Also Reading