Home » బాలకృష్ణ,చిరంజీవి పారితోషికంపై సంచలన విషయాలు బయటపెట్టిన గీతాకృష్ణ..!!

బాలకృష్ణ,చిరంజీవి పారితోషికంపై సంచలన విషయాలు బయటపెట్టిన గీతాకృష్ణ..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరికీ తెలియని విషయాలను ఏదో ఒక రూపంలో అనాలసిస్ చేస్తూ వైరల్ అవుతున్న డైరెక్టర్ గీతాకృష్ణ. ఆయన మరోసారి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. అది ఆ స్టార్ హీరో హీరోయిన్ల గురించి..మరి అదేంటో ఒక సారి చూద్దాం.. ఇండస్ట్రీలో హీరోల దుబారా ఖర్చుల గురించి, నిర్మాత సమస్యలపై ఆయన నోరు విప్పారు.. ప్రస్తుత కాలంలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని అందరూ భావిస్తూ ఉంటే, కొంతమందేమో హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలని కోరుతున్నారు. ఈ సమయంలోనే గీతాకృష్ణ హీరోల దుబారా ఖర్చుల గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

Advertisement

బాలకృష్ణ, చిరు గురించి :
బాలకృష్ణ ఏదైనా సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఖరీదైన హోటల్ నుంచి ఫుడ్ కావాలని డిమాండ్ చేస్తారట. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులకు కూడా అదే హోటల్ నుంచి భోజనం పంపించాలని అంటారట. ఖర్చు మొత్తం నిర్మాతలే భరించాలి.. ఇందులో ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదుకానీ, నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పడం వల్ల తెలిసిందని గీతాకృష్ణ తెలియజేశారు. ఇంతకుముందు బాలకృష్ణ అలా ఉండేవారు కాదని అన్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే మెగా స్టార్ అంటే చాలా డిమాండ్ ఉండేది. ఈ క్రమంలో ఆయన ప్రతి కొత్త సినిమాకు ఒక మారుతీ 800 కారు కావాలని నిర్మాతను అడిగే వారట. నిర్మాత కూడా తప్పనిసరిగా ఆయన అడిగింది ఇవ్వాల్సిందే.

Advertisement

హీరోకు డిమాండ్ ఉంటే నిర్మాతకు బిజినెస్ జరుగుతుందని వాళ్లు భావిస్తే కచ్చితంగా కొని ఇచ్చేవారు. ఇండస్ట్రీ మొత్తం డిమాండ్ మరియు సప్లై అన్నట్టుగా ఉంటుంది. అలాగే హీరోయిన్ల కు డిమాండ్ ఉంటే మాత్రం వారు కూడా అడిగింది ఇవ్వాల్సిందే. అప్పట్లో జయసుధ చెప్పినట్టు ఆమె కుక్కకు కూడా రూమ్ ఇచ్చేవారు . ఒకవేళ హీరోయిన్లకు అవకాశాలు తగ్గి డిమాండ్ లేకుంటే పట్టించుకునే నాథుడే ఉండడు. ఒక హీరో వల్ల 10 కోట్ల వరకు లాభం వస్తుంది అనుకుంటే మాత్రం అడిగింది తప్పనిసరిగా ఇచ్చేవారట. కోటి రూపాయలైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడే వారు కాదట నిర్మాతలు.

ALSO READ:

Visitors Are Also Reading