Home » సల్మాన్‌ ఖాన్ టీంకు ప్రేక్షకుల రిక్వెస్ట్‌.. టైగర్‌ 3 మేకర్స్‌ కీలక నిర్ణయం

సల్మాన్‌ ఖాన్ టీంకు ప్రేక్షకుల రిక్వెస్ట్‌.. టైగర్‌ 3 మేకర్స్‌ కీలక నిర్ణయం

by Anji
Published: Last Updated on
Ad

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ టైగర్‌ ప్రాంఛైజీలో నటిస్తున్న తాజా చిత్రం టైగర్‌ 3. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. హై బడ్జెట్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. షారుఖ్‌ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

Advertisement

రోజు రోజుకు  విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఓపెనింగ్ రోజు వేకువ జామున 7 గంటలకు స్పెషల్‌ షోలు వేయనున్నట్టు ప్రకటించారు. థ్రిల్‌ రైడ్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఈ  సినిమా టికెట్‌ ప్రీ సేల్స్‌ను నవంబర్‌ 5న మొదలు పెట్టనున్నట్టు యశ్ రాజ్ ఫిలిమ్స్‌  ప్రకటించింది. టైగర్‌ 3 మిడిల్ ఈస్ట్‌, నార్త్‌ అమెరికా, యూకే, యూరప్‌, ఆఫ్రికా దేశాల్లో నవంబర్‌ 11న విడుదల కానున్నట్టు తెలియజేస్తూ.. మరో లుక్‌ లాంఛ్ చేశారు మేకర్స్‌. 

Advertisement

పులి గాయపడింది.. అంటూ షూటింగ్‌ టైంలో అప్‌డేట్‌ ఇచ్చి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు సల్లూభాయ్. టైగర్‌ 3లో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి లాంగ్ గ్యాప్‌ తర్వాత మరోసారి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుంది. టైగర్‌ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయని తెలిసిందే. దే ప్రాంఛైజీలో వస్తున్న సినిమా కావడంతో టైగర్‌ 3 పై అంచనాలు భారీగా ఉన్నాయి.  

మరిన్ని  సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading