Home » మార్చి 15లోగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి.. మాల్దీవుల అధ్యక్షుడు సెన్సేషన్ కామెంట్స్..!

మార్చి 15లోగా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి.. మాల్దీవుల అధ్యక్షుడు సెన్సేషన్ కామెంట్స్..!

by Anji
Ad

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఇటీవల చైనాలో పర్యటించారు. అప్పటి నుంచి కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. మాల్దీవుల్లో మోహరించిన తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరింది. ఇంతకు ముందు మార్చిలో 15లోగా మాల్దీవుల్లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు ముయిజు దేశాల పేర్లను ప్రస్తావించకుండా అధ్యక్షుడు ముయిజు పేర్కొన్నారు. ముయిజు చైనా అనుకూల వ్యక్తిగా పేరుంది. ఎన్నికల్లోనూ ఆయన భారత్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పలు వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులను బెదిరించే హక్కు ఏ దేశానికి లేదని ఇంతకు ముందు భారత్‌ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యనించారు. తాజాగా మార్చి 15లోగా తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ముయిజు అధికారికంగా భారత్‌ను కోరినట్లు మాల్దీవుల ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Advertisement

ముయిజ్జు కార్యాలయంలో కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం మాట్లాడుతూ భారత సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉండలేరని.. ఇది అధ్యక్షుడు ముయిజు ప్రభుత్వ విధానమన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. మాల్దీవుల్లో భారత దళాల ఉపసంహరణపై చర్చించేందుకు ఉన్న స్థాయి కోర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్‌ తొలి సమావేశం ఆదివారం ఉదయం మాలేలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో భారత హైకమిషనర్ మును మహవార్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ముయిజు కార్యాలయంలోని కార్యదర్శి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం సైతం సమావేశాన్ని ధ్రువీకరించారు. మార్చి 15లోగా బలగాలను ఉపసంహరించుకోవాలనే అభ్యర్థన అజెండానే సమావేశం జరిగిందన్నారు. అయితే, భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

 

Visitors Are Also Reading