Home » IPL 2023 : 14 ఏళ్ల సచిన్ పగ.. చల్లార్చిన అర్జున్..!

IPL 2023 : 14 ఏళ్ల సచిన్ పగ.. చల్లార్చిన అర్జున్..!

by Bunty
Ad

ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోను ఆ జట్టు గెలుపొందింది. సన్రైజర్స్ హైదరాబాద్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. పేలవ బ్యాటింగ్ తో సునాయాసంగా గెలిచే మ్యాచ్ ను సన్రైజర్స్ చేజార్చుకుంది.

READ ALSO : సెప్టెంబర్‌ నుంచే విశాఖలో కాపురం పెడతా -సీఎం జగన్‌

Advertisement

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 192 పరుగులు చేసింది. కానీ హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో 20 పరుగులు చేస్తే సన్రైజర్స్ గెలుస్తుంది. అలాంటి టైం లో కెప్టెన్ రోహిత్ శర్మ… అర్జున్ కి బౌలింగ్ ఇచ్చారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని అర్జున్, పొదుపు బౌలింగ్ చేయడంతో పాటు భువనేశ్వర్ వికెట్ కూడా తీశాడు.

Advertisement

READ ALSO : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్‌…దుమ్ములేపిన అఖిల్‌

ఇలా భూవీని ఔట్ చేయడంతో 14 ఏళ్ల పగ చల్లార్చుకున్నాడు. ఎందుకంటే 2009లో ఇదే స్టేడియంలో రంజీ మ్యాచ్ సందర్భంగా సచిన్ ని పేసర్ భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశాడు. ఇప్పుడు అదే సచిన్ కొడుకు భువనేశ్వర్ ని అవుట్ చేశాడు. సో అలా సచిన్ 14 ఏళ్ల పగని కొడుకు అర్జున్ తీర్చాడు అన్నమాట. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.

READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

Visitors Are Also Reading