Home » రోజా కోరిక తీరింది.. దత్త పుత్రిక డాక్టర్ అయింది..!!

రోజా కోరిక తీరింది.. దత్త పుత్రిక డాక్టర్ అయింది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక ఊపు, ఊపిన రోజా ఇండస్ట్రీలో ఉండే చిరంజీవి,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. వెండితెరపై ఒక వెలుగు వెలిగి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి రోజా సినిమాల ద్వారానే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు పొలిటిషన్ గా కొనసాగుతూ ఉండేది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం వైసీపీలో మంత్రి హోదాలో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుంది.

Advertisement

సినిమాలు, రాజకీయమే కాకుండా రోజా సామాజిక సేవ చేయడంలో కూడా ముందుంటుంది. ఇకపోతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోజా ఒక అమ్మాయిని దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన చదువు బాధ్యతలు అన్నీ తానే చూసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. ఈ విధంగా చదువులో ఎంతో రాణిస్తున్న పుష్ప అనే అమ్మాయిని పదవ తరగతి చదువుతున్న సందర్భంలో వారి తల్లిదండ్రులు మరణించడంతో, ఆ అమ్మాయిని దత్తత తీసుకుంది. అదే పుష్ప హాస్టల్ లో ఉండి ఇంటర్ పూర్తి చేసింది. ఈ తరుణంలోనే కాలేజీ ప్రిన్సిపల్ రోజా వద్దకు తీసుకెళ్లడంతో ఆమె జగన్ పుట్టినరోజు సందర్భంగా తన చదువు బాధ్యతలను తీసుకుంటానని హామీ ఇవ్వడంతో, నిట్ పరీక్ష కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పంపింది.

Advertisement

ప్రస్తుతం ఈ అమ్మాయి తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో వైద్య విద్యలో కొనసాగుతోంది. త్వరలోనే ఈమె డాక్టర్ కూడా కాబోతున్నారని తెలియడంతో రోజా ఎంతో సంతోషించిందట. ఇదే విషయంపై పుష్ప మాట్లాడుతూ తన తల్లిదండ్రులు వైద్యం లేక మరణించారని, ఈ విధంగా చాలామంది సరైన సమయంలో వైద్యం అందక మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు మరణించినందుకు తాను వైద్యురాలిగా మారి పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే వైద్య వృత్తిని ఎంచుకున్నానని, ఇలాంటి అద్భుత అవకాశాన్ని కల్పించిన రోజా గారికి కృతజ్ఞతలు అంటూ ఆనందభాష్పాలు వెలిబుచ్చింది.

also read:వరలక్ష్మి శరత్ కుమార్:ఆ రెండు హిట్ సినిమాలు వదులుకొని తప్పు చేశా..!!

Visitors Are Also Reading