Home » ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా ఆంటోని స్ట్రీమింగ్‌..!

ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా ఆంటోని స్ట్రీమింగ్‌..!

by Anji
Ad

మలయాళ స్టార్‌ హీరో జోజు జార్జ్‌ నటించిన తాజా చిత్రం ఆంటోని. స్టార్ డైరెక్ట‌ర్ జోషి ద‌ర్శ‌క‌త్వం తెరకెక్కించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌. నైలా ఉషా, చెంబ‌న్ వినోద్ జోస్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు . డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఆంటోని సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది. భారీ కలెక్షన్లతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను ద‌క్కించుకున్న‌ది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది.

Advertisement

Advertisement

తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ పామ్‌ ఆహాలో ఆంటోనీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించి ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఆంటోని సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో జోజు జార్జ్‌ గ్యాంగ్ స్టర్‌గా నటించాడు. మిక్స్‌ డ్ మార్షల్‌ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిగా కల్యాణి కనిపించింది.

 

తండ్రి కూతుళ్ల ఎమోషన్‌ కు కాస్త యాక్షన్ ను జోడించి అద్భుతంగా ఆంటోని సినిమాను రూపొందించారు. ఊరి ప్రజలకు మంచి మంచి చేయడం కోసం రౌడీగా మారతాడు ఆంటోని (జోజు జార్జ్‌). జేవియర్‌ అనే రౌడీని కూడా మట్టు పెడతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా జేవియర్ కూతురు మరియా( కల్యాణి)కి అండగా నిలబడతాడు. దీంతో ఊరి ప్రజలందరూ ఆంటోనీని తప్పు పడతారు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది  తెలుసుకోవాలంటే ఆంటోని సినిమా చూడాల్సిందే.
Also Read : Sr ఎన్టీఆర్ కి ఉపాసన గారి తాతయ్య చేసిన సహాయం ఏంటో తెలుసా !

Visitors Are Also Reading