Home » ఏపీలో ఎన్నికల వేళ.. వాలంటీర్లకు కొత్త బాధ్యతలు.. అవేంటంటే?

ఏపీలో ఎన్నికల వేళ.. వాలంటీర్లకు కొత్త బాధ్యతలు.. అవేంటంటే?

by Srilakshmi Bharathi
Ad

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన కుల గణనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కులాల వారీగా సర్వే చేపట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. ఈ బాధ్యతలను వాలంటీర్లకు అప్పచెప్పింది. గ్రామ, వార్డు స్థాయిల్లో ఉండే వాలంటీర్లు పది రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి కులాల వారీగా వివరాలను సేకరించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 28 వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Advertisement

సచివాలయాల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం 1,23,40,422 కుటుంబాలు గ్రామాల్లో ఉంటున్నాయి. వ్యక్తుల పరంగా తీసుకుంటే ఈ సంఖ్యా 3,56,62,251కు చేరుతుంది. దాదాపు 44,44,887 కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఈ సంఖ్యా 1,33,16,091గా ఉండనుంది.

Advertisement

సచివాలయానికి చెందిన వాలంటీర్లు, ఉద్యోగులు.. వారికి కేటాయించబడిన వీధుల్లో.. ప్రతి ఇంటికి వెళ్లి లెక్క ప్రకారం ఎంత మంది ఉంటున్నారు? మొత్తంగా ఏ కులానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు అనే లెక్కలను తేలుస్తారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఈ లెక్కలు తేల్చడానికి పైలట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. ఇప్పటికే ఏడు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు 3,323 కుటుంబాలకు చెందిన 7,195 మంది వివరాలను నమోదు చేసారు. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించడానికి జగన్ ప్రభుత్వం ఓ యాప్ ని కూడా రూపొందించింది. ఇందులో దాదాపు 723 కులాల జాబితాను పొందుపరచవచ్చు. అగ్రవర్ణాలు మొదలుకుని వెనుక బడిన సామాజిక వర్గాల వరకు అందరి కులాలు ఇందులో పొందుపొరిచారు. మొత్తంగా ఇరవై అంశాలతో ఈ కుల గణన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading