Home » డబ్బుతో వస్తువులు కొనవచ్చు కానీ బుద్దిని కొనలేం…యువకుడి పై రష్మీ ఫైర్…!

డబ్బుతో వస్తువులు కొనవచ్చు కానీ బుద్దిని కొనలేం…యువకుడి పై రష్మీ ఫైర్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మి. రష్మీ మొదట్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ సినిమాలతో రష్మీ కి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో తో రష్మీ యాంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అప్పటికే మంచి సక్సెస్ అందుకున్న జబర్దస్త్ ద్వారా రష్మికి పాపులారిటీ పెరిగిపోయింది. తర్వాత ఢీ డాన్స్ షోలో కూడా యాంకర్ గా చేసింది. ఈ షోతో పాటు మరికొన్ని షోలకు సైతం యాంకర్ గా వ్యవహరించింది.

rashmi gautham

rashmi gautham

అంతేకాకుండా గుంటూర్ టాకీస్ అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ ఆ తరవాత మాత్రం సినిమా ఛాన్స్ లు రాలేదు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై రష్మీ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేళ సొంతంగా తన అభిమానులతో కలిసి వంటలు చేసిన రష్మీ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుక్కలకు ఆహారంగా పెట్టింది.

Advertisement

Advertisement

Anchor Rashmi

అయితే తాజాగా రష్మీ ఓ యువకుడు చేసిన పనికి ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. బెంగళూరులో అపార్ట్మెంట్ లోని యువకుడు కారు నడుపుతూ పక్కనే ఉన్న కుక్క పై నుంచి తీసుకువెళ్ళాడు. దాంతో కుక్క మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పై రష్మి సోషల్ మీడియాలో ఫైర్ అయింది. “డబ్బుతో వస్తువులను కొనవచ్చు.. కానీ బుద్దిని పద్ధతిని కొనలేము….అతన్ని కఠినంగా శిక్షించారనిని తెలిసి సంతోషిస్తున్నాము. అంటూ పేర్కొంది. ఆ కుక్క పడిన బాధ యువకుడి ఫ్యామిలీ కూడా అనుభవించాలి. కుక్కలను రాళ్లతో కొట్టడం పిల్లలకు నేర్పించకండి అంటూ రష్మి హితవు పలికింది. ఇక రష్మీ చేసిన పోస్టుకు పలువురు సపోర్ట్ చేస్తున్నారు.

Visitors Are Also Reading