Home » చిప్స్ విసిరేసారు..చిరంజీవి పిల‌వ‌గానే చెమ‌ట‌లు ప‌ట్టాయ్…అమిత్ తివారి

చిప్స్ విసిరేసారు..చిరంజీవి పిల‌వ‌గానే చెమ‌ట‌లు ప‌ట్టాయ్…అమిత్ తివారి

by AJAY
Ad

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో అమిత్ తివారి, అలీ రెజా కూడా ఉంటారు. వీరిద్దరు రీసెంట్ గా ఆలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంటర్వ్యూలో అమిత్ తివారి మాట్లాడుతూ… తను ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పారు. ముంబైలో నటన, డాన్స్ కు సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలిపారు. తనది లవ్ మ్యారేజ్ అని అమిత్ వెల్లడించారు.

Advertisement

ఇక విక్రమార్కుడు సినిమా లో విలన్ పాత్రలో నటించడంతో ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే వచ్చాయని వెల్లడించారు. నిర్మాత గుణ్ణం గంగరాజు భార్య ఊర్మిళ, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి వల్ల తనకు రాజమౌళి తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పించాల‌ని తాను కోరగా ఊర్మిళ తనను రాజమౌళికి పరిచయం చేశారని అన్నారు. అలా రాజమౌళి తనకు విక్రమార్కుడు సినిమా లో విలన్ గా అవకాశం ఇచ్చారని చెప్పారు.

Advertisement

అంతేకాకుండా విక్రమార్కుడు సినిమా విడుదలైన తర్వాత రాజమౌళి తో కలిసి సుదర్శన్ థియేటర్ లో సినిమా చూశానని చెప్పారు. సినిమా చివరలో తనకు ఉరి పడే సీన్ వచ్చినప్పుడు ముందు కూర్చున్న ఆడియన్స్ చిప్స్ ను ముందుకు విసిరేసి బూతులు తిట్టారు అని అన్నారు. దాంతో రాజమౌళి…. వాళ్ళు నిన్ను తిడుతున్నారు అంటే పాత్ర బాగా వచ్చిందని అర్థం అని తనకు చెప్పారని తెలిపారు.

chiranjeevi

chiranjeevi

ఇప్పటివరకు రెండు వందలకు పైగా సినిమాలలో నటించాన‌ని అమిత్ తివారి వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో మేకప్ మ్యాన్ చిరంజీవి గారు పిలిచారని తన దగ్గరకు వచ్చినట్టు చెప్పారు. దాంతో వెంటనే తనకు చమటలు పట్టాయని అమిత్ తెలిపారు. కానీ చిరంజీవి గారు విక్రమార్కుడు సినిమా లో విలన్ గా చాలా బాగా నటించావ‌ని మెచ్చుకున్నార‌ని అదే త‌న‌కు పెద్ద అవార్డు అని తెలిపారు. స్టాలిన్ సినిమాలో కూడా బాగా నటించావ‌ని చిరంజీవి చెప్పారని తెలిపారు.

Visitors Are Also Reading