Home » పుష్ప- 2 ట్రైల‌ర్ తో అల్లు అర్జున్ గ‌రిక‌పాటి నోరు మూయించాడా..?

పుష్ప- 2 ట్రైల‌ర్ తో అల్లు అర్జున్ గ‌రిక‌పాటి నోరు మూయించాడా..?

by AJAY
Published: Last Updated on
Ad

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప పార్ట్ 2 సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌ల‌య్యింది. ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీమూవీస్ బ్యాన‌ర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ కూడా విడుద‌ల‌య్యింది. పుష్ప పార్ట్ 1 సినిమా తెలుగు తో పాటూ ఇత‌ర భాష‌ల్లోనూ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పార్ట్ 2 పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ALSO READ :దాసరి, చిరు ల మధ్య విబేధాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు ఇంతలా ఉండేవా ? చివరికి ఏమయ్యిందంటే ?

Advertisement

Advertisement

అయితే పుష్ప పార్ట్ 1 పై వేధాంతి గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు ఓ సంధ‌ర్బంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుష్ప సినిమా గంద‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో హీరో గంద‌పు చెక్క‌లు స్మ‌గ్లింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో సినిమా చూసిన త‌ర‌వాత ఓ కార్య‌క్ర‌మంలో గ‌రిక‌పాటి మాట్లాడుతూ స్మ‌గ్లింగ్ చేసేవాడు హీరోనా…స‌మాజానికి ఏం మెసేజ్ ఇవ్వాల‌ని ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యాడు.

అయితే రీసెంట్ గా పుష్ప పార్ట్ 2 ట్రైలర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ ట్రైల‌ర్ లో పుష్ప‌రాజ్ ను మంచివాడుగా చూపించారు. పుష్ప‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్ట‌డంతో పుష్ప‌ను వ‌దిలిపెట్టాలి అంటూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా ప్ర‌జ‌లు నినాదాలు చేస్తూ క‌నిపిస్తున్నారు. దాంతో సినిమాలో పుష్ప‌రాజ్ ను స్మ‌గ్ల‌ర్ గా కాకుండా మంచి వ్య‌క్తిగా చూపించిన‌ట్టు అర్థం అవుతోంది. దాంతో గ‌రిక‌పాటికి పార్ట్ 2 తో అల్లు అర్జున్ పంచ్ ఇచ్చాడ‌ని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

ALSO READ : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి

Visitors Are Also Reading