Home » భార్య చనిపోగానే మరో పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరంటే..?

భార్య చనిపోగానే మరో పెళ్లి చేసుకున్న స్టార్స్ ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మగవాళ్ళ జీవితంలో భార్య పాత్ర అనేది చాలా ప్రధానమైనది. పెళ్లి నుండి చచ్చే వరకు భార్య అనేది తోడుగా ఉంటే ఆ మనిషికి ఇంకో వ్యక్తి అవసరం లేదనిపిస్తుంది. అలాంటి భార్య అర్ధాంతరంగా దూరమైతే మగాడు మరో స్త్రీని తమ జీవితంలోకి ఆహ్వానించడం తప్పేమీ కాదు. ఆ విధంగా భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకున్న స్టార్ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ముందుగా విద్యా దేవి అనే ఆమెతో వివాహం జరిగింది. ప్రమాదవశత్తు ఆమె మరణించడం జరిగింది.

Advertisement

 

ఆ తర్వాత మోహన్ బాబు తన భార్య చెల్లెలు నిర్మల గారిని పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా మొదటి భార్య సీతాదేవి, మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప పుట్టిన తర్వాత, సీతాదేవి ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న కృష్ణంరాజు శ్యామల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన సౌందర్య గురించి చాలామందికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత ఆమె భర్త రఘు, మరో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు అపూర్వ.

Advertisement

ఇద్దరు గోవాలో స్థిరపడ్డారు. మరో వ్యక్తి దిల్ రాజ్. తన భార్య చనిపోయిన తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. తేజస్విని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని, వీరికి ఒక బాబు కూడా జన్మించారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ కూడా ఈ కోవకే చెందినవారు. ఈయన తన భార్య బసవతారకం మరణించిన తర్వాత, లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఈ విధంగా భార్య చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్న స్టార్ నటులు.

also read:ప‌వ‌న్ క‌ల్యాణ్ మొదటి భార్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

Visitors Are Also Reading