టాలీవుడ్ లో బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఉమాదేవి కూడా ఒకరు. ఉమాదేవి వందల చిత్రాలలో మరియు సీరియల్స్ లో నటించి అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా తనదైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. అయితే ఉమాదేవి ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా మాట్లాడుతూ హౌస్ లో శత్రువులను సంపాదించుకుంది.
Advertisement
దాంతో ఎలిమినేషన్ లోకి రావడం వల్ల ఫైనల్స్ వరకూ హౌస్ లో ఉండలేకపోయింది. అంతే కాకుండా కార్తీకదీపం సీరియల్ లో దీపకు బంధువు పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఉమాదేవి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు. కానీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత తన ఫ్యామిలీ గురించి చెప్పింది. ఉమాదేవి తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇద్దరి మధ్య గొడవల వల్ల విడిపోయామని చెప్పింది.
Advertisement
ఉమాదేవి తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పింది. వారిద్దరూ తన వద్దనే ఉంటారని వెల్లడించింది. అంతే కాకుండా పెద్ద కుమార్తెను సన్నీకి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నానని తన కూతురు సన్ని ఫ్యాన్ అని చెప్పింది. దాంతో ఓ సీరియల్ సమయంలో సన్నిని పరిచయం చేస్తే అతడిని అన్నయ్య అని పిలిచిందని సరదగా చెప్పింది. ఇదిలా ఉండగా ఉమాదేవి పెద్ద కూతురు ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తోంది.
ఉమాదేవి పెద్ద కుమార్తె పేరు తనూష కాగా ఇప్పటికే సోషల్ మీడియాలో వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. మాటీవీ లో పలు టీవీ షోలలో సందడి చేస్తోంది. అంతే కాకుండా ఇటీవల ఓ షోలో సురేఖవాణి కూతురు సుప్రితతో కలిసి సందడి చేసింది. తనూష కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక తన తల్లితో కలిసి రీల్స్ చేస్తూ…ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.