Home » ఎన్టీఆర్ హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా …? ఇప్పుడు ఎలా ఉందంటే ..?

ఎన్టీఆర్ హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా …? ఇప్పుడు ఎలా ఉందంటే ..?

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించిన చాలామంది హీరోయిన్ లు ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అలాంటి లిస్ట్ లో సమీరారెడ్డి కూడా ఒకరు. సమీరా రెడ్డి అంటే ఇప్పటి ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఒకప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

Advertisement

ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ లో సమీరా రెడ్డి సినిమాలు చేసింది. కాగా ఎన్టీఆర్ తో సినిమా తర్వాత చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రానా హీరోగా ఇలియానా హీరోయిన్ గా నటించిన కృష్ణం వందే జగద్గురు సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.

Advertisement

అయితే కృష్ణం వందే జగద్గురు సినిమా తర్వాత సమీరారెడ్డి సినిమాలకు దూరమైంది. కాగా ఇటీవల సమీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. దాంతో సమీరారెడ్డికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఇంటర్వ్యూలో సమీరారెడ్డి మాట్లాడుతూ…. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గ్లామర్ కోసం సర్జరీలు చేసుకునేవారని పేర్కొంది. కానీ తాను మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లలేదని చెప్పింది. తాను ఇండస్ట్రీలోకి ప్రవేశించాక దాదాపు పదేళ్ల క్రితం ముక్కు తో పాటు చెస్ట్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునే వారని తెలిపింది. తనను కూడా చేయించుకోవాలని సలహా ఇచ్చారని…. కానీ తాను అలాంటి వాటిని పట్టించుకోలేదని పేర్కొంది.

సర్జరీ చేయించుకోవడం వ్యక్తిగత నిర్ణయం అని వారికి ఇష్టంతోనే అలా చేసేవారని వెల్లడించింది. ఇది ఇలా ఉంటే సమీరా రెడ్డి సినిమాలకు దూరమైన తర్వాత అక్షయ్ వార్దే ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు. ఇక సినిమాలకు దూరమైనా సమీరారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చాలా దగ్గరగానే ఉంటుంది.

AlSO READ : ఆస్పత్రి లో ఉన్న “తారకరత్న” భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading