Home » ఆ మూవీ కోసం వెంకటేష్ ఒడిలో కూర్చున్నా.. ఆ నటి నాగార్జునకి అన్నం తినిపించానంటూ ?

ఆ మూవీ కోసం వెంకటేష్ ఒడిలో కూర్చున్నా.. ఆ నటి నాగార్జునకి అన్నం తినిపించానంటూ ?

by Anji
Ad

ప్రముఖ టాలీవుడ్ నటి జయలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించగా, ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయలక్ష్మి మాట్లాడుతూ.. నేను పెద్ద పెద్ద డైరెక్టర్ల డైరెక్షన్ లో చాలా సినిమాలలో చేశానని ఆమె తెలిపారు. వరుసగా ఒకే డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో తాను నటించలేదని జయలక్ష్మి తెలిపారు. రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ ల పక్కన నటించడం లక్ గా భావిస్తానని ఆమె తెలిపారు. బొమ్మరిల్లు సినిమాలో నా రోల్ చిన్న రోల్ అయినా, ఆ సినిమా ద్వారా వచ్చిన గుర్తింపు మామూలు గుర్తింపు కాదని, ఆమె కామెంట్ చేశారు. 

Advertisement

Advertisement

విశ్వనాథ్ డైరెక్షన్ లో కూడా నటించానని విజయలక్ష్మి పేర్కోన్నారు. నేను ఎన్ని సినిమాలలో నటించానో గుర్తు లేదని ఆమె తెలిపారు. నేను చేసిన ప్రతి సినిమా ఆడియన్స్ లోకి వెళ్లిందని జయలక్ష్మి చెప్పుకొచ్చారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకటేష్ ఒడిలో కూర్చునే సీన్ లో చేశానని, ఆ సీన్ చాలా ఫన్నీ సీన్ అని ఆమె తెలిపారు. బరువు తక్కువని అలా కూర్చోమన్నారని నన్ను ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్ లా కూర్చునేలా షూట్ చేశారని ఆమె అన్నారు. ఆ సీన్ కు  రెండు మూడు టేక్స్  పట్టాయని జయలక్ష్మి వెల్లడించారు. సినిమాలు చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

గ్రీకువీరుడు సినిమాలో నేను నాగార్జునకు యంగ్ మేనత్తగా చేశానని ఆ సినిమాలో కొడుకుకు పిసికి, పిసికి  ముద్దులు పెడతానని జయలక్ష్మి చెప్పారు. నాగార్జున పాత్ర రియలైజ్ అయిన సమయంలో అత్త నాకు నీ చేతితో అన్నం కలిపి ముద్దలు పెట్టాలని చెబుతారని ఆ సినిమా నాకు చాలా మంచి అనుభవం అని విజయలక్ష్మి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

Visitors Are Also Reading