Home » లక్ష్మీదేవి ని నిర్లక్ష్యం చేశాను అందుకే.. ఇప్పుడు నా దగ్గర లేదు అంటూ ఎమోషనల్ అయిన జయలలిత..!

లక్ష్మీదేవి ని నిర్లక్ష్యం చేశాను అందుకే.. ఇప్పుడు నా దగ్గర లేదు అంటూ ఎమోషనల్ అయిన జయలలిత..!

by Sravya
Ad

సీనియర్ నటి జయలలిత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. జయలలిత అందరికీ పరిచయమే. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈమె దక్షిణ భారత చలనచిత్ర నటి అలానే శాస్త్రీయ నృత్యకారిణి కూడా. ఈమె శృంగార హాస్య పాత్రలను ఎక్కువగా పోషిస్తూ ఉండేది. జాతీయ పురస్కారం పొందిన గ్రహణం సినిమాలో కీలక పాత్ర పోషించింది. రుద్రం కోట, క్షేత్రం, ఆటాడిస్తా, గోపి గోపిక గోదావరి, మాయాబజార్, గుండమ్మగారి మనవడు, కితకితలు, సర్దార్ పాపన్న ఇలా చాలా సినిమాల్లో ఈమె నటించింది. పలు సీరియల్స్ లో కూడా జయ లలిత నటించింది.

Jayalalitha Tragic Love Story

Advertisement

దీపారాధన, బంగారు గాజులు, ప్రేమ ఎంత మాత్రం వంటి సీరియల్స్ లో కూడా జయలలిత నటించింది. ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలని పంచుకుంది. బాగా ఎమోషనల్ అవుతూ కోట్ల రూపాయల్ని పోగొట్టుకున్నానని ఇప్పుడు బాధ పడుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇది వరకు ఈమె లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేశారని అందుకే లక్ష్మీదేవి తన నుండి వెళ్ళిపోయింది అని బాధపడ్డారు. అనిల్ గణపతి రాజు వలన నష్టపోయానని డబ్బులు ఈమె దగ్గర నుంచి తీసుకునే వారిని ఎమోషనల్ అయింది.

Advertisement

జయలలిత కి ఫేక్ ఐపీ పెట్టి అనిల్ గణపతి రాజు చాలా నష్టాన్ని కలిగించారని, నాలుగు కోట్ల ని కోల్పోయానని జయలలిత అన్నారు ఇది ఇలా ఉంటే చిరంజీవితో నటించాలని ఈమె చాలా సార్లు అనుకున్నారు. కానీ జయలలిత కి చిరంజీవి పక్కన నటించే అవకాశం దొరకలేదట. అప్పట్లో ఆలీ, వై విజయ, బ్రహ్మానందం వంటి నటులతో ఈమె కష్టాలని చెప్పుకునేవారట. ఇలా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ లలిత ఈ విషయాలను షేర్ చేసుకుని ఎమోషనల్ అయింది. కొరటాల శివ ఇచ్చిన రోల్ చాలా బాగుందని కొరటాల శివ మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించిందని కూడా జయలలిత చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading