Home » తల్లిదండ్రులపై అమానుషంగా ప్రవర్తించిన కొడుకు.. తల్లి చాతిపై తన్నీ మరీ..!

తల్లిదండ్రులపై అమానుషంగా ప్రవర్తించిన కొడుకు.. తల్లి చాతిపై తన్నీ మరీ..!

by Anji
Ad

ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా.. ఏ మాత్రం కనికరించలేదు. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బూ**తులు తిడుతూ రెచ్చిపోయాడు. కన్నతల్లి  చాతి భాగంపై తన్నాడు. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో చోటుచేసుకుంది.

Advertisement

మదనపల్లి టూ టౌన్  పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని నీరు గట్టువారిపల్లె, అయోధ్యనగర్ లో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులురెడ్డికి భూ వివాదం ఉంది. ఆస్తి కోసం తల్లితండ్రుల మీద దారుణంగా దాడి చేశాడు కన్న కొడుకు. సోదరుడికి భూమి ఎలా రాశారంటూ దాడి చేశాడు. దీంతో తల్లి దండ్రులు దన్నం పెడుతున్నా వదలలేదు. కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లఢిల్లడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలవేసింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

 

మదనపల్లె 2 టౌన్ సీఐ బాధిత తల్లిదండ్రులను పరామర్శించి జరిగిన దాడిపై ఆరా తీశారు. ఇది చూసినా నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడుతూ పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలపై ఇంతా అమానుషంగా ప్రవర్తిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : హైదరాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్.. ఇద్దర్నీ ఒకేచోట చూసి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading