Home » సచివాలయంలో ఎండిపోయిన మహాగని మొక్క.. కేసీఆర్ సెంటిమెంట్ కూడా అలాగేనా..?

సచివాలయంలో ఎండిపోయిన మహాగని మొక్క.. కేసీఆర్ సెంటిమెంట్ కూడా అలాగేనా..?

by Anji
Ad

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి దాదాపు 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో పోరాడి.. తెలంగాణను సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. మళ్లీ రెండోసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తరువాత కొద్ది రోజులకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. రేపే వారి భవితవ్యం తేలనుంది.

Advertisement

అయితే గత ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ఫలితాలు పొందిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈసారి ఎన్నికలప్పుడూ అదే యాగాన్ని ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌస్ లో నిర్వహించారు. నవంబర్ 01 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే.. ప్రజా ఆశీర్వాద సభలకు సైతం హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా మహాగని మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నాటించారు. అయితే ప్రతీరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. ఏపుగా పెరిగేందుకు వీలుగా అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పుట్టకుండా మందుల్ని సైతం వాడారు.

Advertisement


ఆ మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా శుభం జరుగుతుందని భావించిన కేసీఆర్.. దీనిని  సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో, మరే కారణమో తెలియదు కానీ..  అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం బతకలేదు. ప్రచారం ముగుస్తున్న సమయంలో అది బతికే అవకాశం లేదని తేలిపోయింది. ఇక బతికే ఛాన్స్ లేదని అర్థమైంది. ఏదో అపశకునమేననే అభిప్రాయం వ్యక్తం అయింది. ఆ ఎఫెక్ట్ పోలింగ్ రోజున కనిపించిందనే కామెంట్లు వినిపించాయి. మొక్క ఎండిపోవడం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావనే అపశకునానికి సంకేతమన్న మాటలు వచ్చాయి.

ఆ నమ్మకాలకు బలం చేకూరే తరహాలో పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలూ వెలువడ్డాయి. అటు యాగం ద్వారా, ఇటు మొక్క నాటడం ద్వారాను ఫలితాలు రాకపోవచ్చనే స్పష్టత ఏర్పడింది. హరితహారం స్కీమ్ లో భాగంగా నాటిన సంపెంగ లాంటి మొక్కలు ఏపుగానే పెరిగినా, మహాగని విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలు రావడం తొలి అపశకునం అని గులాబీ నేతల భావన. కరీబియన్ దీవుల్లో వేపుగా పెరిగే ఈ మొక్కలను కలప అవసరాల కోసం కేరళలో పెంచాలని చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. కానీ సచివాలయంలో మాత్రం అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

 

Visitors Are Also Reading