Ad
తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటూ పార్టీని స్థాపించి పెను సంచలనాన్ని సృష్టించడమే కాకుండా అధికారం చేపట్టిన NTR… పాలనలో కూడా అదే దూకుడును ప్రదర్శించారు. తనదైన మార్క్ పాలనతో వాహ్ వా అనిపించాడు.
NTR ప్రవేశ పెట్టిన 10 అద్భుత పథకాలు:
Advertisement
- 2/- KG బియ్యం :
1983 లో అధికారంలోకి రాగానే NTR తెచ్చిన పథకం 2/- KG బియ్యం! ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది.
- సంపూర్ణ మద్యపాన నిషేదం
కాయకష్టం చేసి సంపాదించిన సొమ్ము తాగుడుకే సరిపోతుందన్న కారణంతో సంపూర్ణ మద్యపాన నిషేద పథకాన్ని ప్రవేశ పెట్టాడు. మహిళలు అన్నగారి ఫోటో పెట్టి మరీ సంబరాలు చేసుకున్నారు.
- EMCET
EMCET రాసి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనేది చాలా మంది కల! ఆ EMCET ను స్టార్ట్ చేసిందే NTR.
- పటేల్ పట్వారీ విధానం రద్దు:
పటేల్ పట్వారీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పేదల భూములను తమ చేతిలో పెట్టుకొని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఒక్క సంతకంతో ఈ విధానాన్ని రద్దు చేసి పేద రైతులకు ఆనందం పంచాడు.
Advertisement
- MGBS బస్ స్టాప్:
మహాత్మాగాంధీ బస్ స్టేషన్…వాస్తవానికి నిజాం కాలంలో ఇమ్లీబన్ బస్టాండ్ ఉండేది. దాన్ని పెంచి పూర్తిస్థాయిలో MGBS ను తీర్చిదిద్దాడు. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి ఇక్కడి నుండి బస్ ఉండేలా చేశాడు.
- హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహం:
నెక్లెస్ రోడ్డు చుట్టూ ఉన్న తెలుగు భాషను, జాతిని జాగృతం చేసిన యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయించింది హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా NTR యే.!
- 5 లక్షల ఇండ్ల నిర్మాణం:
పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేయించి ఇవ్వాలన్న ఉద్దేశంతో తన 5 ఏళ్ల పాలనలో 5 లక్షల ఇండ్లను నిర్మించి పేదల కళ్లలో ఆనందాన్ని నింపాడు.
- శాసన మండలి రద్దు:
శాసన మండలిని నిర్వహించడం వృథా ఖర్చుగా భావించిన ఎన్టీఆర్ ఆ విధానాన్ని రద్దు చేశాడు. ఇదో విప్లవాత్మక నిర్ణయం….తర్వాత రాజశేఖర్ రెడ్డి ఈ విధానానికి మళ్లీ స్టార్ట్ చేశాడు.
- ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజన పథకం :
పేద విద్యార్థులను ప్రోత్సాహించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాడు.
- స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్:
బడుగు బలహీన వర్గాలు రాజకీయాల్లో ఎదగాలని… స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్స్ ను ప్రవేశపెట్టాడు.
- తెలుగు సినిమా ఇండస్ట్రీని మద్రాస్ నుండి హైద్రాబాద్ కు తరలింపు:
మద్రాస్ కేంద్రంగా నడుస్తున్న తెలుగు సినీ ఇండస్ట్రీని హైద్రాబాద్ కు తరలించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. దీంతో చాలా మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి.