ఓలా, ఉబెర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడి కావాలంటే అక్కడికి సుఖవంతంగా ప్రయాణం చేస్తున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకొని కారును బుక్ చేసుకుంటే చాలు…డైరెక్ట్గా ఇంటివద్దకే వచ్చి పికప్ చేసుకుంటారు. అయితే, గత కొంతకాలంగా ఓలా, ఉబెర్ డ్రైవర్లు రైడ్ను తరచుగా క్యాన్సిల్ చేస్తూ వినియోగదారులకు చిరాకు కలిగిస్తున్నారు.
Advertisement
Advertisement
ఓలా, ఉబెర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడి కావాలంటే అక్కడికి సుఖవంతంగా ప్రయాణం చేస్తున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకొని కారును బుక్ చేసుకుంటే చాలు…డైరెక్ట్గా ఇంటివద్దకే వచ్చి పికప్ చేసుకుంటారు. అయితే, గత కొంతకాలంగా ఓలా, ఉబెర్ డ్రైవర్లు రైడ్ను తరచుగా క్యాన్సిల్ చేస్తూ వినియోగదారులకు చిరాకు కలిగిస్తున్నారు.
దీంతో క్యాబ్ డ్రైవర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక కస్టమర్లకు కాల్ చేసి పికప్, రైడ్ చార్జీల గురించి తెలుసుకొని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. పికప్ లొకేషన్ దూరంగా ఉంటే వెంటనే రైడ్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు క్యాబ్ డ్రైవర్లు. ఇలాంటి చర్యలతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఓలా, ఉబెర్ సంస్థలపై ఫిర్యాదులు చేస్తున్నారు. పెట్రోల్ దరలు పెరగడమే దీనికి కారణం అని, పైగా ఓలా, ఉబెర్ సంస్థలు 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని, తమకు ఏం మిగలడం లేదని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్ల పరిష్కారానికి మార్గం ఉబెర్ సంస్థ సిద్ధం అవుతున్నది. పికప్ లొకేషన్, చార్జీలు తెలుసుకునే విధంగా కోడింగ్ చేస్తున్నట్టు ఉబెర్ సంస్థ తెలియజేసింది. ఇక పికప్ లొకేషన్ దూరంగా ఉంటే అదనపు చార్జీలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయి ఓలా, ఉబెర్ సంస్థలు.